Bollywood: పఠాన్ తో ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

Bollywood: గత రెండేళ్ళ నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పెద్ద హీరోల నుంచి వచ్చిన సినిమాలు ఏవీ కూడా థియేటర్స్ లో నిలబడటం లేదు. ఫ్లాప్ టాక్ నే తెచ్చుకుంటున్నాయి. వందల కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాలు అందులో సగం కూడా కలెక్షన్స్ చేయడం లేదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ కి గ్రహణం పట్టిందని చెప్పాలి. ముఖ్యంగా సుశాంత్ సింగ్ మరణానికి బాలీవుడ్ లో నెపోటిజం కారణం అని బలంగా నమ్మిన వారందరూ కూడా ఆ కుటుంబాల నుంచి వచ్చే సినిమాలని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే బ్యాన్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆరంభంలో ఈ బ్యాన్ బాలీవుడ్ అనే నెగిటివ్ ప్రచారాన్ని బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోలేదు. అలాంటి నెగిటివ్ ప్రచారాలు ప్రతిసారి జరుగుతూనే ఉంటాయని కొట్టిపారేశారు. సినిమాలో కంటెంట్ నచ్చితే ఆడియన్స్ థియేటర్స్ కి ఆటోమేటిక్ గా వస్తారని బలంగా నమ్మారు. ఇక బాలీవుడ్ లో ఎక్కువగా సెక్యులర్ భావజాలం ముసుగులో హిందుత్వంపై, హిందూ ఆచారాలు, విశ్వాసాలని కించపరిచే విధంగా సినిమాలు చేస్తున్నారని కూడా హిందుత్వ వాదులు అందరూ కూడా నమ్మడం మొదలు పెట్టారు. నార్త్ ఇండియాలో హిందుత్వ భావజాలం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఆ భావజాలాన్ని బలంగా నమ్మేవారు అందరూ కూడా బాలీవుడ్ సినిమాలని ద్వేషించడం మొదలు పెట్టారు.

అదే సమయంలో సౌత్ సినిమాల ఆధిపత్యం మొదలైంది. టాలీవుడ్ లో బాహుబలి సిరీస్, కేజీఎఫ్ సిరీస్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తికేయ, కాంతారా లాంటి సినిమాలు భాగా ప్రభావితం చేశాయి. ఈ నేపధ్యంలో సౌత్ దర్శకులు ఇండియన్ నేటివిటీలో కథలు చెబుతూ మన మూలాలని బలంగా చూపించే ప్రయత్నం చేస్తారనే నమ్మకం నార్త్ ఇండియన్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింది. బాలీవుడ్ సినిమాలు అన్ని కూడా పాశ్చాత్య పోకడలతో ఉంటాయని, వారు వేసుకునే కాస్ట్యూమ్స్ నుంచి సినిమా కంటెంట్ వరకు ఇందులో కూడా ఇండియన్ నేటివిటీ కనిపించదని విమర్శలు వెళ్ళాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్ నీడ పడకుండా తెరకెక్కిన మణికర్ణిక, ది కాశ్మీర్ ఫైల్, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు కాస్తా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఇవి బాలీవుడ్ లో జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయానని చెప్పాలి.

ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న పఠాన్ మూవీపై అందరూ నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమాతో మళ్ళీ బాలీవుడ్ ఇండస్ట్రీకి పాత రోజులు వస్తాయని నమ్మారు. అయితే పఠాన్ మూవీపై కూడా నెగిటివ్ ప్రచారం నడిచింది. రిలీజ్ రోజు కూడా హిందుత్వ సంఘాలు పఠాన్ సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అన్ని చేసిన కూడా మొదటి రోజు ఏకంగా 55 కోట్ల నెట్ ని ఈ మూవీ రాబట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా పఠాన్ ఇప్పుడు నిలిచింది. ఇక రెండో రోజు కూడా కలెక్షన్స్ 50 కోట్లు దాటుతాయనీ అంచనా వేస్తున్నారు. సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా కావడంతో దేశభక్తిని సినిమాలో టచ్ చేయడంతో నార్త్ లో కూడా ప్రేక్షకులకి రీచ్ అయ్యింది. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tirumala: శ్రీవారి భక్తులు అలర్ట్…SSD టోకెన్ రద్దు చేసిన టీటీడీ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…

14 hours ago

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

2 days ago

Temple Donation: ఆలయానికి డబ్బు దానం ఇస్తున్నారా? ఇవి దానం చేస్తే రెట్టింపు పుణ్యం?

Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…

2 days ago

Health care: రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేస్తున్నారా.. ఈ ఇబ్బందులు మీ వెంటే?

Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…

3 days ago

Tirumala: తిరుమల భక్తులు అలర్ట్.. గదుల  కేటాయింపులో కీలక మార్పులు చేసిన టీటీడీ..

Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…

3 days ago

Covid 19: కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…

3 days ago

This website uses cookies.