Parijatham Plant: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటాము. అదేవిధంగా ఎన్నో రకాల వృక్షాలను కూడా దైవ సమానంగా భావించి పూజిస్తూ ఉంటాము. ఇలా దైవ సమానంగా భావించి పూజించే మొక్కలలో పారిజాతం ఒకటి. ఈ పారిజాత వృక్షాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తుంటారు.
పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి సాగర మధనం చేస్తున్నటువంటి సమయంలో ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఈ పారిజాతం వృక్షాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆ ఇంటిలో సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక పారిజాత పుష్పాలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఎక్కువగా పూస్తాయి .
ఈ పారిజాత పుష్పాలు రాత్రి సమయంలో విరబూసి ఉదయానికి చెట్టు నుంచి రాలిపోతాయి. ఇలా రాలిపోయిన పుష్పాలను ఏరి పూజించడం వల్ల శుభం కలుగుతుంది. ఇక పారిజాత వృక్షాన్ని మన ఇంటి ఆవరణంలో నాటుకునేటప్పుడు ఎక్కడపడితే అక్కడ కాకుండా తులసి కోట పక్కన నాటుకోవడం ఎంతో మంచిది. అలాగే ఇంటి దగ్గరలోనే ఆలయ ప్రాంగణం ఉంటే అక్కడ కూడా ఈ వృక్షాన్ని నాటడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.