Categories: DevotionalLatestNews

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విశాల ఆలయప్రాంగణంలో గత తొమ్మిది రోజులుగా మహా వైభవంగా జరుగుతున్న ఆరవ బ్రహ్మోత్సవాల తుది మంగళఘట్టమైన చక్రస్నానం వేద ఘోషలమధ్య అత్యద్భుతంగా సాగింది.

గత తొమ్మిదిరోజులుగా వివిధ వాహనాలతో మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా సాగడం.. వెనుకనే భక్త జనసంద్రం పోటెత్తడం భాగ్యనగర చరిత్రలో ఊహాతీత భక్తిఘట్టంగా చెప్పక తప్పదు.

జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ ముద్దాడ రవిచంద్ర ఆదేశం మేరకు, టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజ గోపాల నాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో.. హైదరాబాద్ టీటీడీ ఏఈఓ రమేష్, హైదరాబాద్ జూబిలీహిల్స్ టీటీడీ టెంపుల్ ఇంచార్జి నిరంజన్ ఈ ఉత్సవాలను నిర్వహించన తీరు జంటనగరాల చరిత్రలో హైలైట్‌గా నిలిచింది.

Puranapanda Srinivas Sreemaalika Book Highlight in Hyderabad TTD Celebrations

Puranapanda Srinivas: బ్రహ్మోత్సవాల్లో శ్రీమాలిక పరమాద్భుత గ్రంధాన్ని

ఈసారి మాజీ మంత్రి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, బీఎస్‌సిపీఎల్ ఇన్ఫ్రా గ్రూప్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పించిన శ్రీ మాలిక నాలుగు వందల పేజీల గ్రంధం వందలకొలది భక్తులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా.. ఈ ఉత్సవాల శోభతో హైలైట్‌గా నిలవడం విశేషం. ఉత్సవాల ప్రారంభానికి ముందే బొల్లినేని కృష్ణయ్య ఈ మహా గ్రంధం శ్రీమాలిక వేల ప్రతులను టెంపుల్ ఇంచార్జి‌కి అర్చకుల సమక్షంలో అందివ్వడంతో.. ఏఈవో రమేష్ పర్యవేక్షణలో ఈ చక్కని గ్రంధాన్ని ఉత్సవ నిర్వహణలో ఉపకరించిన దాతలకు, పారిశ్రామిక వేత్తలకు, వీఐపీ దర్శనాల్లో పాల్గొన్న మంత్రులకు, ప్రముఖులకు టెంపుల్ ఇంచార్జి నిరంజన్ ప్రసాదంతో పాటు ఆశీర్వచన మంటపంలో అందివ్వడం ఈసారి బ్రహ్మోత్సవాల్లో వైభవంగానే చెప్పాలని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Puranapanda Srinivas Sreemaalika Book Highlight in Hyderabad TTD Celebrations

మరీ ముఖ్యంగా ఈసారి బ్రహ్మోత్సవాల్లో శ్రీమాలిక పరమాద్భుత గ్రంధాన్ని శోభాయమాన శ్రీ నరసింహస్వామి అందాలతో పవిత్రీకరించి.. మొత్తం బ్రహ్మోత్సవాలకే తలమానికంగా నిలిచేలా అందించి ఎంతోమంది ప్రశంసలు పొందిన శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఉదయ సాయంకాల వేళల్లో పాల్గొని తన్మయించడం అక్కడి వందల కొలది భక్తులను ఎంతో ఆకర్షించింది. శ్రీనివాస్‌తో ఎంతోమంది భక్తులు సెల్ఫీలు దిగడం మీడియా కంటపడింది. ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ మహద్భాగ్యమని పురాణపండ శ్రీనివాస్ ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలపడం అభినందనీయం.

Puranapanda Srinivas Sreemaalika Book Highlight in Hyderabad TTD Celebrations

జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ చైర్మన్ ఏ.వి రెడ్డి ప్రతీరోజు మాడవీధుల ఉభయ సంధ్యలులో వాహన సేవల ఉత్సవాలను పర్యవేక్షించారు. తిరుమల నుండి వచ్చిన వేద పండితులు వైఖానస ఆగమోక్తంగా వైదిక విధులను నిర్వర్తించారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ చక్రస్నానంలో పాల్గొన్నారు. ఈ చక్రస్నాన మహోత్సవం తిరుమల ఉత్సవాన్ని తలపించిందని వేల వేల భక్తులు సంతోషంతో పొంగిపోవడం సత్యమేకదా అని ఆలయ అర్చకులు శృతికలిపారు.

సాయంకాలం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ప్రసన్న గంభీర ధ్వనుల వేద ఘోషల మధ్య ధ్వజ అవరోహణ కార్యక్రమం జరిగింది. వందల కొలది భక్తుల గోవిందనామాల మధ్య హైదరాబాద్ టీటీడీ ఆలయాల ఏ ఈ ఓ రమేష్, ఇంచార్జీ నిరంజన్, టీటీడీ జూబిలీహిల్స్ చైర్మన్ ఏ. వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

AP NEWS: బాలినేని శ్రీనివాస రెడ్డి ఆపరేషన్ సక్సెస్.. వైసీపీలో ప్రకంపనలు.!

AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…

9 hours ago

Chandrababu: జొన్నగిరి బంగారం.. అప్పుడే మార్కెట్‌లోకి వ‌చ్చేసిందా..?

Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…

10 hours ago

Tollywood: ఒకేసారి 3 సినిమాలతో మ‌హేష్‌.. ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్‌లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…

10 hours ago

Jamun Fruits: నేరేడు పండ్లను తినకుండా పక్కన పెడుతున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!

Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…

10 hours ago

AP NEWS: రఘురామకృష్ణరాజు స్థలానికే ఎసరు.. రూ.2 కోట్ల ల్యాండ్ మాయం.!

AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…

11 hours ago

Jyeshtha Pournami: నేడే జేష్ఠ్య పౌర్ణమి.. ఈ పనులు చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయినట్టే?

Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…

12 hours ago

This website uses cookies.