Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఒకటి కల్కి సీక్వెల్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD 2024లో వచ్చి ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఈ మూవీ సీక్వెల్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రతీ ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే, తాజా సమాచారం మేరకు కల్కి మూవీ సీక్వెల్ మొదలైనట్టుగా ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈ మూవీలో నటించే చైల్డ్ ఆర్టిస్టుల కోసం కూడా ఆడిషన్స్ నిర్వహించారు. దీన్ని బట్టి చూస్తే కల్కి మూవీ సీక్వెల్ షూట్ మొదలైనట్టుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక, మొదటి భాగంలో అమితాబ్ బచ్చన్, దీపిక పడుకోణ్, కమల్ హాసన్, దిశా పఠాని, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాంగోపాల్ వర్మ నటించారు.
కానీ, సీక్వెల్ మూవీలో మాత్రం దీపిక పడుకోణ్ నటించడం లేదు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రూపొందుతున్న స్పిరిట్ మూవీలో దీపిక నటించాల్సి ఉండగా..సందీప్తో ఆమెకి వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల తప్పించారు. ఆ ఎఫెక్ట్ కల్కి సీక్వెల్ మీద కూడా పడింది. అఫీషియల్గా ఇందులో నుంచి కూడా తప్పించారు. దీపిక స్థానంలో సాయి పల్లవి నటించనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా, కల్కి సీక్వెల్ మూవీ షూటింగ్ కోసం శంకర్ పల్లిలో వేసిన భారీ సెట్స్లో షూటింగ్ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ లపై సీన్స్ని దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరిస్తున్నాడట. మరి, కల్కి సీక్వెల్ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా అధికారికంగా మేకర్స్ వెల్లడించలేదు. కాగా, ప్రభాస్ సలార్ సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కీ 2, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్..ఇలా అన్నీ భారీ పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.