Niharika Konidela : యదు వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ కమిటీ కుర్రోళ్లు. ఈ మూవీని నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి ప్రొడ్యూజ్ చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్లులో ఫ్రెష్ టాలెంట్ కనిపించనుంది. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా మూవీ యూనిట్ హైదరాబాద్ వేదికగా టీజర్ని రిలీజ్ చేసింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్కు నిహారిక స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఇష్యూ గురించి స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మెగా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విక్టరీ సాధించారు. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. మెగా ఫ్యామిలీ కూడా పవన్ గెలుపును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇక ప్రమాణస్వీకార కార్యక్రమంలో మెగా యువహీరోల సందడి అంతా ఇంతా కాదు. అయితే ఈ సందడిలో ఒక్క ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్యనే జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో బన్నీ వైసీపీ క్యాండిడేట్ కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. రిజల్ట్స్ తర్వాత మామకు ట్విటర్లో పోస్ట్ పెట్టి తన పని తాను చేసేశాడు. ఇదే క్రమంలో రిజల్ట్స్ అనౌన్స్ మెంట్ తర్వాత అల్లు అర్జున్ను మెగా హీరో సాయి తేజ్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. దాంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. అల్లు అర్జున్ భార్య స్నేహను సైతం ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో అన్ఫాలో చేసినట్లు సమాచారం. అల్లు వారి ఫ్యామిలీలో కేవలం అల్లు శిరీష్ను మాత్రమే తేజ్ ప్రస్తుతం ఫాలో అవుతున్నాడు. అయితే సాయి తేజ్ తప్ప మిగతా హీరోలందరూ బన్నీని ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. నెటిజ్స్ దీని గురించే అప్పటి నుంచి తెగ డిస్కస్ చేస్తున్నారు.
రీసెంట్ గా ఈ వివాదం గురించి నిహారిక కొణిదెల రియాక్ట్ అయ్యింది. కమిటీ కుర్రోళ్లు టీజర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన నిహాను ఈ టాపిక్ గురించి ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా.. “అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఇష్యూ గురించి నాకు ఇంకా తెలియదు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి కదా” అని రిప్లై ఇచ్చి టాపిక్ డైవర్ట్ చేసింది.సినిమా గురించి మాట్లాడుతూ..”ఓ కుటుంబంలా ఎంతో కష్టపడి సినిమా తీశాం. త్వరలోనే ట్రైలర్ లాంచింగ్ ఉంటుంది. వంశీ స్టోరీ చెప్పినప్పుడు పదకొండు మంది జీవితాల్ని ప్రత్యక్షంగా చూసినట్టుగా అనిపించింది. ఈ మూవీలోని ప్రతి ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది” అని తెలిపింది.
Allu Arjun: బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.