Technology: ప్రపంచంలో అత్యధిక మంది వినియోగిస్తున్న మెసెంజర్ యాప్ వాట్సాప్. ఓ విధంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగిస్తున్నారు. అత్యంత వేగంగా ఇంటర్నల్ గా మన సర్కిల్ లో ఉన్న వ్యక్తులతో అన్ని రకాల సమాచారాలని చేరవేసుకోవడానికి ఈ వాట్సాప్ ఎంతో ఉపయోగపడుతుంది. మారుతున్న టెక్నాలజీని మరింత సులభతరం చేస్తూ యూజర్ ఫ్రెండ్లీగా యాప్ ని ఆ సంస్థ తీసుకొస్తుంది. దీనికోసం గ్రూప్ కమ్యూనికేషన్ కూడా డెవలప్ చేసింది.
అలాగే ఒకప్పుడు పీర్ టూ పీర్ వాట్సాప్ కాల్ మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు గ్రూప్ వీడియో కాల్, ఆడియో కాల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా టెక్నాలజీ ఆధారంగా పని చేసే ఉద్యోగులు అందరూ వర్క్ ఫ్రామ్ హోమ్ కి అలవాటు పడ్డారు. ఇది వాట్సాప్ వినియోగదారులని మరింత పెంచింది. అయితే ప్రస్తుతం వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ని యూజర్స్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వరకు వాట్సాప్ గ్రూప్ చాట్ లో తక్కువ మందికి మాత్రమే పరిమితి ఉండేది.
అయితే ఇప్పుడు కొత్త ఫీచర్ ద్వారా 512 మందిని గ్రూప్ లో యాడ్ చేయొచ్చని ఆ సంస్థ పేర్కొంది. అలాగే ఇక ఇది వరకు ఎంబీలలో ఉన్న ఫైల్స్ మాత్రమే వాట్సాప్ ద్వారాషేర్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సామర్ధ్యాన్ని 2జీబీకి పెంచింది. అలాగే డిలేట్ చేసిన మెసేజ్ లని మళ్ళీ స్టోరేజ్ చేసుకోవడానికి అండూ అనే ఆప్సన్ కూడా తీసుకొచ్చింది. ఎమోజీని చాట్ కి ట్యాగ్ చేయడానికి కొత్త అప్షన్స్ తీసుకొచ్చింది.
ఇలా సరికొత్త మార్పులతో వాట్సాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చినట్లు మెటా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని మార్పులు కూడా ఉండబోతున్నాయని ప్రకటించారు. మొత్తానికి వాట్సాప్ టెక్నాలజీలో మార్పులకి తగ్గట్లు యూజర్స్ వినియోగానికి మరింత సులభతరం చేసేందుకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి చాలా ఫాస్ట్ అప్డేట్స్ ని, ఇంటరెస్టింగ్ అప్డేట్స్ ని తీసుకొస్తుంది.
Banana: అరటి పండు మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో ఒకటి. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో అరటిపండు…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ…
saliva on Sleeping: సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో నోటి నుంచి మనకు తెలియకుండానే లాలాజలం వస్తుంటుంది. ఇలా లాలాజలం కారణంగా…
Tirumala SSD Tokens: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తిరుమల చేరుకుంటున్నారు.…
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
This website uses cookies.