Categories: Inspiring

Spiritual: బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన హిందూ దేవాలయం

Spiritual: భారతదేశంలో ఎన్నో దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. శైవ ఆలయాలు, వైష్ణవ ఆలయాలు వేలాది సంఖ్యలో భారతదేశంలో సనాతన వైదిక నాగరికత లో భాగమై ఉన్నాయి. ఎంతోమంది మహారాజు ఈ ఆలయాలను అప్పటి వారి ఇ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మించారు. అయితే ఈ ఆలయాల వెనుక ఎంతో ప్రశస్తమైన వైదిక చరిత్ర దాగి ఉంది. సాక్షాత్తు భగవంతుడి భక్తులకు కోరికలు ఇచ్చేందుకు ఈ భూమండలం పైకి వచ్చి స్వయంభువుగా వెలసిన దివ్య క్షేత్రాలు ఒక ప్రసిద్ధి పొందాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాలని అనుసంధానిస్తూ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, మహిమాన్వితమైన శక్తి పీఠాలు, వైష్ణవ ఆలయాలు వేలాది ఏళ్లుగా పూజలందుకుంటున్నాయి. హిందూ మతాన్ని విశ్వసించే భక్తులు వేల సంఖ్యలో ఈ ఆలయాలను, అక్కడ వెలసిన దేవాది దేవుని దర్శించుకోవడానికి వ్యయప్రయాసలకోర్చి వెళ్తూ ఉంటారు. అయితే భారత దేశం పై ముస్లింల దండయాత్ర కాలంలో ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారు. దీంతో చాలా ఆలయాలు శిథిలావస్థకు చేరి ఎలాంటి పూజలు నోచుకోకుండా ఉన్నాయి. మరికొన్ని ఆలయాలు పునర్నిర్మించి వైదిక ఆచారాలను నిర్వహిస్తున్నారు. హలో ముస్లింల దండయాత్ర ధ్వంసమైన ఆలయం మధ్యప్రదేశ్లో భైద్యనాధ్ ఒకటి.

బ్రిటిష్ వాళ్ళు ఇండియా ని ఆక్రమించుకున్న తర్వాత కూడా ఎన్నో ఆలయాలను కూల్చివేశారు. అయితే ఈ ఒక్క ఆలయాన్ని బ్రిటిష్ వాళ్ళ నిర్మించడం విశేషం. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఒకే ఒక ఆలయంగా భైద్యనాథ్ ఆలయం చరిత్రలో నిలిచిపోయింది. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. మార్టిన్ అనే బ్రిటిష్ కల్నల్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం సమయంలో ముస్లిం రాజులతో పోరాటానికి వెళ్లారు. ఆ సమయంలో బ్రిటిష్ సైన్యం ముస్లిం సైన్యం చేతిలో ఓడిపోయే స్థితిలో ఉంది. బ్రిటిష్ కల్నల్ భార్య ఈ ఆలయంలో మహా దేవుని దర్శించుకుని, అక్కడి పూజారులు చెప్పిన ప్రకారం శివపంచాక్షరీ మంత్రాన్ని 11 రోజులపాటు పట్టించింది. దాంతో సాక్షాత్తు ఆ మహా దేవుడి బ్రిటిష్ సైన్యం తరఫున ముస్లిం సైన్యంతో పోరాడి వారిని తరిమి కొట్టి మార్టిన్ సైన్యాన్ని కాపాడాడు. ఈవిషయం ఇండియాకు వచ్చిన తర్వాత మార్టిన్ తన భార్యతో పంచుకున్నాడు. ఒక త్రిశూలదారి వచ్చి తమని రక్షించినట్లు చెబుతాడు. దీంతో సాక్షాత్తు పరమశివుడే తన భర్తను కాపాడమని మార్టిన్ భార్యకు అర్థమవుతుంది. అదే విషయాన్ని భర్తకు తెలియజేసి ఆలయానికి వెళ్లి ఆ ఆలయ పునర్నిర్మాణం కోసం 15000 విరాళంగా ఇచ్చారు. ఈ విషయం అక్కడి శిలాఫలకాలలో వ్రాయబడి ఉంది. వీటి ఆధారంగా బ్రిటిష్ వారు నిర్మించిన శివాలయంగా భైద్యనాధ్ ఆలయం చరిత్రకెక్కింది

Varalakshmi

Share
Published by
Varalakshmi

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

19 hours ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

6 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

6 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.