Categories: Inspiring

Spiritual: బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన హిందూ దేవాలయం

Spiritual: భారతదేశంలో ఎన్నో దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. శైవ ఆలయాలు, వైష్ణవ ఆలయాలు వేలాది సంఖ్యలో భారతదేశంలో సనాతన వైదిక నాగరికత లో భాగమై ఉన్నాయి. ఎంతోమంది మహారాజు ఈ ఆలయాలను అప్పటి వారి ఇ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మించారు. అయితే ఈ ఆలయాల వెనుక ఎంతో ప్రశస్తమైన వైదిక చరిత్ర దాగి ఉంది. సాక్షాత్తు భగవంతుడి భక్తులకు కోరికలు ఇచ్చేందుకు ఈ భూమండలం పైకి వచ్చి స్వయంభువుగా వెలసిన దివ్య క్షేత్రాలు ఒక ప్రసిద్ధి పొందాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాలని అనుసంధానిస్తూ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, మహిమాన్వితమైన శక్తి పీఠాలు, వైష్ణవ ఆలయాలు వేలాది ఏళ్లుగా పూజలందుకుంటున్నాయి. హిందూ మతాన్ని విశ్వసించే భక్తులు వేల సంఖ్యలో ఈ ఆలయాలను, అక్కడ వెలసిన దేవాది దేవుని దర్శించుకోవడానికి వ్యయప్రయాసలకోర్చి వెళ్తూ ఉంటారు. అయితే భారత దేశం పై ముస్లింల దండయాత్ర కాలంలో ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారు. దీంతో చాలా ఆలయాలు శిథిలావస్థకు చేరి ఎలాంటి పూజలు నోచుకోకుండా ఉన్నాయి. మరికొన్ని ఆలయాలు పునర్నిర్మించి వైదిక ఆచారాలను నిర్వహిస్తున్నారు. హలో ముస్లింల దండయాత్ర ధ్వంసమైన ఆలయం మధ్యప్రదేశ్లో భైద్యనాధ్ ఒకటి.

బ్రిటిష్ వాళ్ళు ఇండియా ని ఆక్రమించుకున్న తర్వాత కూడా ఎన్నో ఆలయాలను కూల్చివేశారు. అయితే ఈ ఒక్క ఆలయాన్ని బ్రిటిష్ వాళ్ళ నిర్మించడం విశేషం. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఒకే ఒక ఆలయంగా భైద్యనాథ్ ఆలయం చరిత్రలో నిలిచిపోయింది. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. మార్టిన్ అనే బ్రిటిష్ కల్నల్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం సమయంలో ముస్లిం రాజులతో పోరాటానికి వెళ్లారు. ఆ సమయంలో బ్రిటిష్ సైన్యం ముస్లిం సైన్యం చేతిలో ఓడిపోయే స్థితిలో ఉంది. బ్రిటిష్ కల్నల్ భార్య ఈ ఆలయంలో మహా దేవుని దర్శించుకుని, అక్కడి పూజారులు చెప్పిన ప్రకారం శివపంచాక్షరీ మంత్రాన్ని 11 రోజులపాటు పట్టించింది. దాంతో సాక్షాత్తు ఆ మహా దేవుడి బ్రిటిష్ సైన్యం తరఫున ముస్లిం సైన్యంతో పోరాడి వారిని తరిమి కొట్టి మార్టిన్ సైన్యాన్ని కాపాడాడు. ఈవిషయం ఇండియాకు వచ్చిన తర్వాత మార్టిన్ తన భార్యతో పంచుకున్నాడు. ఒక త్రిశూలదారి వచ్చి తమని రక్షించినట్లు చెబుతాడు. దీంతో సాక్షాత్తు పరమశివుడే తన భర్తను కాపాడమని మార్టిన్ భార్యకు అర్థమవుతుంది. అదే విషయాన్ని భర్తకు తెలియజేసి ఆలయానికి వెళ్లి ఆ ఆలయ పునర్నిర్మాణం కోసం 15000 విరాళంగా ఇచ్చారు. ఈ విషయం అక్కడి శిలాఫలకాలలో వ్రాయబడి ఉంది. వీటి ఆధారంగా బ్రిటిష్ వారు నిర్మించిన శివాలయంగా భైద్యనాధ్ ఆలయం చరిత్రకెక్కింది

Varalakshmi

Share
Published by
Varalakshmi

Recent Posts

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

19 hours ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

22 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

3 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

5 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

5 days ago

This website uses cookies.