Health: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రోగాలు ప్రజలను భయపెడుతూ ఉంటాయి. మారుతున్న కాలంతో పాటు కొత్త కొత్త వ్యాధులు మానవ జీవితానికి ఒక ప్రమాదకర సంకేతాలుగా ఉన్నాయి. గత రెండేళ్ల కాలంలో కోవిడ్ మహమ్మారి ఎంత భయ పెట్టిందో ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్లాది మంది ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. లక్షల్లో ప్రజలు మృత్యువాత పడ్డారు. అయితే ప్రస్తుతానికి కరోనా మహమ్మారికి టీకాను కనిపెట్టి దానిని నిర్మూలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరైన వ్యాధి నిరోధక శక్తిని పెంచడం ద్వారా కరోనా బారిన పడకుండ టీకాలు వేయడం జరుగుతుంది. అయితే గత 20 ఏళ్ల కాలంలో ప్రపంచాన్ని వణికిస్తున్న మరో ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్. క్యాన్సర్ మహమ్మారి శరీరంలో రకరకాల భాగాలలో కనిపించి రకరకాల పేర్లతో జన ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా ప్రజలు వినేవారు. అయితే ఇప్పుడు రక రకాల క్యాన్సర్లు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. చిన్న వయసులోనే చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. మనం ఉపయోగించే వస్తువులు, తినే ఆహారంలో రసాయన కారకాలు ఎక్కువగా కలవడం వలన శరీరంలో క్యాన్సర్ కణితులు వృద్ధి చెంది వ్యాధిగా రూపాంతరం చెంది బయటపడుతుంది.
అయితే క్యాన్సర్ కి కూడా మందుని కనిపెట్టే ప్రయత్నం చాలాకాలం నుంచి జరుగుతుంది. అయితే తాజాగా చరిత్రలో మొదటి సారి క్యాన్సర్ హౌస్ లోన్ కోసం చేసిన క్లినికల్ ట్రయల్స్ లో అద్భుతమైన ఫలితాలను చూసినట్లు తెలుస్తుంది. అత్యంత ప్రమాదకరమైన పేగు క్యాన్సర్ తో బాధపడుతున్న కొంతమంది పేషెంట్ లపై డోస్టార్ లిమాబ్ అనిల్ హౌస్ దాన్ని సైంటిస్ట్లు క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ప్రయోగించారు. ఈ ఔషధం వాడిన తర్వాత రోగుల్లో క్యాన్సర్ తగ్గిపోయినట్లుగా పరిశోధకులు తెలుసుకున్నారు. శరీరంలో క్యాన్సర్ కణాలు అన్నింటినీ ఔషధం నాశనం చేసినట్లు గుర్తించారు. 18 మంది రోగులపై ఈ అవుదాం ప్రయోగించగా 12 నెలల తర్వాత వారిలో క్యాన్సర్ కణాలు అంతమైనట్లు గుర్తించారు. అన్ని రకాల టెస్ట్ చేసిన తర్వాత వాళ్లు క్యాన్సర్ట్లు మాయమైనట్లు నిర్ధారించారు. ఇక ఈ ఔషధం కారణంగా ఇతర భాగాలకు కూడా క్యాన్సర్ కణాలు వ్యాప్తిచెందలేదని గుర్తించారు. ఇక ఈ ప్రయోగాలు పూర్తిస్థాయిలో సఫలం అయితే ఇతర రకాల క్యాన్సర్ల పైన కూడా ప్రయోగించి వాటిని మార్కెట్లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Ananya Nagalla: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం "లీసా". వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
This website uses cookies.