Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. నెట్టింట్లో జరిగే ప్రతి ట్రెండ్ను ఆయన ఫాలో అవుతుంటారు. అంతే కాదు ఫ్యాన్ వార్లను కూడా చాలా శ్రద్దగా గమనిస్తుంటారు నాగబాబు. ఎవరేం అనుకుంటున్నారు.. ఎవరెలా రెస్పాండ్ అవుతున్నారో పరిశీలిస్తుంటారు. అప్పుడప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వివాదాలకు కారణమవుతుంటారు. ఈ క్రమంలో నాగబాబు రీసెంట్ గా ఏపీ ఎన్నికల తర్వాత ఓ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. మావాడైనా పరాయివాడే.. పరాయి వాడైనా మా వాడే అంటూ ఓ నోట్ రాశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇలా ట్వీట్ వేశాడో లేదు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి వేశాడు అన్నది మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు.కానీ కొంత మంది అది అల్లు అర్జున్ గురించే అంటూ కామెంట్స్ రాయడంతో ఆ ట్వీట్ పై మళ్లీ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ స్టార్ట్ అయ్యింది.
నాగబాబు ట్వీట్ తో రెండు రోజులు మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్ వార్ జరిగింది. అల్లు రామలింగయ్య లేకపోతే మెగా బ్రదర్ లేడు అనే స్థాయికి ట్రోలింగ్ జరిగింది. మెగా ఫ్యామిలీకి చెందినవాడై ఉండి వైసీపీ క్యాండిటేడ్ కు బన్నీ ప్రచారం చేశాడు కాబట్టి.. నాగబాబు అలా అన్నాడు అంటూ నెటిజన్స్ తీర్మానించేసుకుని నెట్టింట్లో ట్రోలింగ్కు ఎగబడ్డారు. మరి ఈ ట్రోలింగ్ చూసో లేక ఈ బురద మనకెందుకు అని అనుకున్నాడు కాబోలు ఆ ట్వీట్ ని డిలీట్ చేసి అకౌంట్ ను డీ యాక్టివ్ చేశారు. మా దెబ్బకు భయపడ్డాడు అంటూ బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. దీనికి వైసీపీ కార్యకర్తలు కూడా వంత పాడారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు మళ్లీ ట్విట్టర్లోకి ఎంటర్ అయ్యారు. నేను ఆ పోస్ట్ డిలీట్ చేశానంటూ మళ్లీ ట్వీట్ వేశాడు. దీంతో మళ్లీ ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.