Eye Tips: సాధారణంగా చలికాలంలో చాలామంది కళ్ళు తొందరగా పొడిబారి ఎర్రగా మారుతూ ఉంటాయి. ఇలా కళ్ళు కనక పొడిబారినట్లు అయితే కళ్ళు మంటలు రావడం జరుగుతుంది. ఇలా కళ్ళు ఎర్రగా మారి ఇబ్బంది పడేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల కళ్ళు ఎరబడటం తగ్గిపోతుంది. మరి కళ్ళు ఎర్రగా మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే..
కళ్ళు పూర్తిగా పొడి బారినప్పుడే ఎర్రగా మారుతాయి అందుకే కళ్ళను ఎప్పుడు తేమగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అందుకే మన కంటిలోకి మార్కెట్లో లభించే కృతమ కన్నీటిని రెండు చుక్కలు వేసుకోవడం వల్ల ఈ కన్నీళ్లు కంటిపై భాగంలో పొరల ఏర్పడి మన కళ్ళు పొడిబారకుండా ఉంటాయి. ఇలా చలికాలంలో రెండు చుక్కలు కృత్రిమ కన్నీళ్లను వేసుకోవడం ఎంతో మంచిది.
వీటితోపాటు మనం ఎక్కువగా చల్లగాలికి గురి కాకుండా అదే విధంగా సూర్యకాంతి మనపై పడకుండా ఉండాలి అంటే బయటకు వెళ్లిన ప్రతిసారి కళ్ళకు రక్షణ కల్పించుకొని వెళ్లాలి అంటే మంచి సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్లడం వల్ల సూర్య కాంతి నేరుగా మన కళ్ళపై పడదు అదేవిధంగా దుమ్ము ధూళి కూడా కళ్ళల్లో పడదు. ఇకపోతే మన శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఉన్నప్పుడే కళ్ళు కూడా పొడిబారవు అందుకే తరచూ నీటిని తాగుతూ ఉండాలి. వీటితోపాటు తగినంత నిద్ర కూడా ఎంతో అవసరం. మనకు సుమారు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి సమస్యలు అనేవి తలెత్తవు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.