Gangavva: గంగవ్వ సొంతిల్లు కల నెరవేరింది..గృహ ప్రవేశానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వచ్చి సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గంగవ్వ సొంతింటికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘మై విలేజ్ షో’ అనే కార్యక్రమంతో గంగవ్వ యూట్యూబ్ స్టార్గా అందరికి సుపరిచితురాలు. అలా వచ్చిన పాపులారిటీతోనే బిగ్బాస్ తెలుగు 4వ సీజన్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ బిగ్ రియాలిటీ షోతో గంగవ్వ ఇంకా బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ షోలో ఉన్నప్పుడే నాగార్జునకు తనకు సొంతిల్లు నా కల అనే కోరికను బయటపెట్టింది.
దాంతో ఆమె హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన సమయంలో నాగార్జున ప్రామిస్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా వచ్చిన డబ్బుకు అదనంగా కొంత డబ్బు ఇస్తానని ..నీ సొంతింటి కల నెరవేస్తునాని చెప్పారు. అన్నట్టుగానే నాగార్జున గంగవ్వకు బిగ్ బాస్తో గెలుచుకున్న అమౌంట్కు కొంత మొత్తం అందించారు. ఈ డబ్బుతో ఆమె సొంతగా ఇంటి నిర్మాణం మొదలు పెట్టింది. మొత్తానికి ఇటీవలే గంగవ్వ సొంతిల్లు నిర్మాణం పూర్తై గృహ ప్రవేశం జరిగింది. గ్రాండ్గానే ఈ కార్యక్రమాన్ని గంగవ్వ నిర్వహించింది.
గంగవ్వ ఇంటి గృహ ప్రవేశానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అఖిల్, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు. ఆమె బంధువులు, సన్నిహితులు వచ్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గంగవ్వ త్వరలో నాగార్జునను కలిసి తన సొంతిల్లు గృహ ప్రవేశం జరిగిన విషయాన్ని చెప్పడంతో పాటు ఆ ఫొటోలను ఆయనకు చూపించి కృతజ్ఞతలు తెలపబోతున్నట్టు తెలుస్తోంది. ఇక గంగవ్వ తన సొంతింటి కల నెరవేరిందని ఓ వీడియోను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయగా నెటిజన్స్ అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.