Devotional Facts: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని ఆచార వ్యవహారాలను ఎత్తు పద్ధతిగా పాటించడం ఎంతో మంచిది. లేకపోతే నెగటివ్ ప్రభావం ఏర్పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో విషయాలలో వాస్తు శాస్త్రాన్ని గట్టిగా విశ్వసిస్తూ ఉంటాము ముఖ్యంగా చనిపోయిన వారి ఫోటోల విషయంలో కూడా చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. చనిపోయిన వారి ఫోటోలను చాలామంది వారి ప్రేమకు గుర్తుగా ఇంటి నిండా వారి ఫోటోలను అలంకరించుకొని ఉంటారు.
ఇక చనిపోయిన వారు దేవుళ్లతో సమానమని వారి ఫోటోలను దేవుడు గదిలో పెట్టి పూజిస్తూ ఉంటారు. ఇలా చనిపోయిన వారి ఫోటోలను దేవుడు గదిలో పెట్టి పూజించడం మంచిదేనా పండితులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే.. శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడూ కూడా దేవుడు గదిలో పెట్టకూడదు. ఇలా దేవుడు గదిలో పెట్టడం వల్ల వారి ఇంట్లో ఎప్పటికీ మానసిక ప్రశాంతత ఉండదని కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను గోడకు ఎప్పుడు కూడా వేలాడతీయకూడదు.
చనిపోయిన వారి ఫోటోలను మనం పెట్టుకోవాలి అంటే ఏదైనా చెక్క బల్ల పై వారి ఫోటోలను పెట్టాలి కానీ గోడకు మాత్రం వేలాడ తీయకూడదు. ముఖ్యంగా బ్రతికున్న వారి ఫోటోలు పక్కన చనిపోయిన వారి ఫోటోలను పెట్టడం వల్ల బ్రతికున్న వారికి రోజురోజుకీ ఆయుష్ తగ్గుతుందని అందుకే ఎట్టి పరిస్థితిలోనూ ఈ తప్పులు చేయకూడదని చెబుతున్నారు ఇక ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలను కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లు అయితే ఆ ఫోటోలు ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు గోడకు ఉండి వారి ముఖచిత్రం దక్షిణం వైపుకు ఉండేలా చూసుకోవాలి ఇలా ఉన్నప్పుడే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇక ఎప్పుడూ కూడా ఈ ఫోటోలను మనం ఇంట్లోకి రాగానే మనకు కనిపించే విధంగా ఉండకూడదు అలా ఉండటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.