ప్రముఖ నటుడు శివాజీ బుల్లితెరపైకి రానున్నాడు. ఒకప్పుడు వెండితెరపై వరుస విజయాలు అందుకున్న శివాజీ ఈ మధ్య బిగ్ బాస్ షోతో ట్రెండింగ్లోకి వచ్చారు. ఆ తరువాత 90s వెబ్ సిరీస్ అంటూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈటీవీ విన్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీల్లో రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు వారందరినీ ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్తో శివాజీ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.
అలాంటి శివాజీ ప్రస్తుతం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. వెండితెర, ఓటీటీ అంటూ సక్సెస్ సాధించిన శివాజీ ఇప్పుడు బుల్లితెరపై కొత్త అవతరాన్ని ఎత్తబోతోన్నారు. ఈటీవీలో వచ్చే వినోద కార్యక్రమానికి జడ్జ్గా రాబోతోన్నారట. అయితే ఏ షోకు న్యాయ నిర్ణేతగా రాబోతోన్నారని మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం ఈటీవీలో బోలెడన్ని ఎంటర్టైన్మెంట్ షోలు వస్తోన్న సంగతి తెలిసిందే.
ప్రతీ సోమవారం రాత్రి గం. 9. 30 ని.లకు పాడుతా తీయగా అనే కార్యక్రమం వస్తుంది.బుధవారం, గురువారం ఢీ వస్తుంది. శుక్రవారం, శనివారం జబర్దస్త్ షోలు వస్తున్నాయి. మరి వీటిల్లో శివాజీ ఏ షోకు గెస్టుగా వచ్చి ఆడియెన్స్ను అలరిస్తారో చూడాలి.
Sai Pallavi: ఫిదా బ్యూటీ సాయి పల్లవికి బాలీవుడ్లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన మొదటి సినిమా డిజాస్టర్…
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
This website uses cookies.