Fri. Jul 17th, 2026

    Varahi Ammavari Mudupu: ఇటీవల కాలంలో వారాహి అమ్మవారి భక్తుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం వారాహి నవరాత్రులు నడుస్తున్న నేపథ్యంలో చాలామంది వారాహి వ్రతం ఆచరిస్తున్నారు. ఇలా వారాహి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇలా అమ్మవారి దీక్షలో తొమ్మిది రోజులపాటు ఈ వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరుపుకుంటారు. వారాహి దేవిని పూజిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. మనలోని అహంకారం, భయం, కోరికలను అణచివేసి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది.జూలై 15 వ తేదీ ప్రారంభమైన ఈ నవరాత్రులు జూలై 23 వరకు జరుగుతాయి.

    ఈ నవరాత్రులలో భాగంగా అమ్మవారికి ప్రత్యేకంగా వ్రతం ఆచరించి అనంతరం అమ్మవారికి ముడుపు కట్టడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మరి వారాహి అమ్మ వారికి ఎలా ముడుపు కట్టాలి? ఏంటి అనే విషయానికి వస్తే..వారాహి అమ్మవారికి ముడుపు కట్టడం కోసం కొత్త ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ వస్త్రానికి నాలుగు వైపులా అలాగే మధ్యలో కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక అందులో తాంబూలం, అక్షింతలు, ఎరుపు రంగు పుష్పాలు, మన స్తోమత కొద్ది దక్షిణ, కొబ్బరికాయ ఉంచి మూడు ముడులు వేయాలి. ముడులు వేస్తున్న సమయంలో మనం కోరుకున్న కోరికను మనసులో అనుకుంటూ కోరిక నెరవేరాలని ప్రార్థించాలి. ఇలా ముడుపు కట్టిన తర్వాత ఈ ముడుపును అమ్మవారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయాలి.

    How to tie varahi Ammavari Mudupu know details
    How to tie varahi Ammavari Mudupu know details

    Varahi Ammavari Mudupu: ఆలయానికి విరాళంగా ఇవ్వాలి..

    ఇక అమ్మవారి పూజలో భాగంగా శనగలతో చేసిన వంటకాలు దద్దోజనం పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. పూజా సమయంలో ఓం హ్రం క్రీం ఐం వజ్ర వరాహి నమః అనే మంత్రాన్ని చదవాలి. మన కోరిక నెరవేరిన తర్వాత ముడుపు తీసి ఏదైనా ఆలయానికి విరాళంగా ఇవ్వాలి లేదంటే అమ్మవారి హుండీలో కానుకగా వేసేయాలి అనంతరం ముడుపులో కట్టిన కొబ్బరికాయను పగలకొట్టి ఆ కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి మొక్కు చెల్లించుకోవాలి.