YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ బలమైన రాజకీయ వ్యూహాలతో వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే మరల తమని అధికారంలోకి తీసుకు వస్తాయని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఇక జగన్ సూచించిన మార్గంలోనే నాయకులు అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం నిర్దేశించిన విధంగానే మార్గంలోనే ప్రతిపక్షాలపై మాటలతో దాడి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే భౌతిక దాడులకి కూడా తెగబడుతూ అసలు ప్రతిపక్షాలకి ఓట్లు వేయకుండా ప్రజలని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది కొంత మంది ఆరోపణ.
అయితే వైసీపీకి గ్రౌండ్ లెవల్ లో సర్పంచ్ ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. దీనికి కారణం కూడా ఉంది. పంచాయితీ రాజ్ నిందులని వైసీపీ ప్రభుత్వ పథకాలకి వాడుకుంటుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ లో కూడా అంత సంతృప్తికరంగా లేరు. అయితే వైసీపీకి గ్రామీణ స్థాయిలో ఉండే పెద్ద బలం వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 ఉల్లకి ఒక వాలంటీర్ ని నియమించడం ద్వారా జగన్ పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరందరూ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వైసీపీ పార్టీ కోసం పని చేస్తున్నారు.
ఇక ఎన్నికల ముందు వారిని ఉత్తమ వాలంటీర్ గా జిల్లాల వారీగా గుర్తించి వారికి క్యాష్ ప్రైజ్ ఇచ్చి గౌరవిస్తోంది. తద్వారా వాలంటీర్ల ద్వారా గ్రౌండ్ లెవల్ లో సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయించి ఓటుబ్యాంకు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తోంది. తాజాగా విజయవాడలో జరిగిన వాలంటీర్లకి వందనం కార్యక్రమం ద్వారా వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలు పోతాయని జగన్ నేరుగానే చెప్పారు. అందుకే వైసీపీకి తనకి సైన్యంగా అందరూ పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో మీరే వైసీపీ లీడర్లు అంటూ కొత్తగా మరో భరోసా జగన్ ఇచ్చారు.
Guava fruit: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇలా పండ్లలో…
SSD Tokens Cancelled: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే…
Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…
Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
This website uses cookies.