జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా తన రాజకీయ వ్యూహాలతో వైసీపీని గద్దె దించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా తగ్గకుండా ఓ వైపు సోషల్ మీడియాని, మరో వైపు పబ్లిక్ మీటింగ్స్ ద్వారా వైసీపీకి చెమటలు పట్టిస్తున్నాడు అనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ వైఫల్యాలని, ఆ నాయకుల విధానాలని బలంగా ప్రజలలోకి తీసుకొని వెళ్తున్నారు.
తాను సిద్ధాంతపరంగా ప్రభుత్వ చేస్తున్న పనులపై విమర్శలు చేస్తే తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ప్రజలకి గట్టిగానే నమ్మిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యక్తిగత దాడి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి ఎంత సేపు దత్తపుత్రుడు, ముగ్గురు పెళ్ళాలు అనే మాటలు తప్ప వైసీపీ నాయకుల దగ్గర మరింకేమీ ఉండటం లేదా అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నాయి.
ఇక వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పడంతో పాటు టీడీపీతో పొత్తు సమీకరణాలకి తెరతీసిన పవన్ కళ్యాణ్ వైసీపీకి టెన్షన్ పెట్టాడు. జనసేనానిని ఎలా అయినా టీడీపీతో కలవకుండా ఆపాలనే వైసీపీ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఇప్పుడు ఇద్దరూ కలిసి వచ్చిన ఎదుర్కోవడానికి జగన్ తన టీమ్ ని సిద్ధం చేస్తున్నారు. ఇక జగన్ కూడా బయటకి వచ్చి సభలలో పాల్గొన్నప్పుడు తాను సింహంలా సింగిల్ గా వస్తూ ఉన్నా అని వారంతా గుంటనక్కల మాదిరిగా తన మీద దాడి చేస్తున్నారని విమర్శలు చేశారు. అలాగే ఎప్పటిమాదిరిగా దత్తపుత్రుడు అంటూ అదే పల్లవి పాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గత మీటింగ్ లో మాట్లాడుతూ ఏపీలో క్యాస్ట్ వార్ నడుస్తుందని అన్నారు.
వైసీపీ కులాలని విభజించి రాజకీయం నడుపుతుందని విమర్శించారు. అయితే దీనికి కౌంటర్ గా జగన్ ఏపీలో జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదని క్లాస్ వార్ అని పేర్కొన్నాడు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్ లతో కౌంటర్ ఇచ్చారు. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారని అన్నారు. అలాగే ధనిక ముఖ్యమంత్రి పాలనలో తాను తప్ప అందరూ బానిసలే అని భావన వైసీపీలో ఉందని విమర్శించారు.
క్లాస్ వార్ కి జగన్ కొత్త నిర్వచనం చెప్పారని, ఓ వైపు పేదలపై పడి అన్ని విధాలుగా దోచుకుంటూ తాను పేదవాడిని అని చెప్పుకుంటూ ప్రజలని నమ్మించాలని అనుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ట్వీట్ లపై వైసీపీ మళ్ళీ భుజాలు తడుముకుంటూ పవన్ ముగ్గురు పెళ్ళాలు అంటూ మంత్రి అమర్ నాథ్ విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది.
Guava fruit: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇలా పండ్లలో…
SSD Tokens Cancelled: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే…
Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…
Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
This website uses cookies.