Categories: NewsPolitics

Pawan Kalyan: ట్వీట్ లతో భయపెడుతున్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా తన రాజకీయ వ్యూహాలతో వైసీపీని గద్దె దించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా తగ్గకుండా ఓ వైపు సోషల్ మీడియాని, మరో వైపు పబ్లిక్ మీటింగ్స్ ద్వారా వైసీపీకి చెమటలు పట్టిస్తున్నాడు అనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ వైఫల్యాలని, ఆ నాయకుల విధానాలని బలంగా ప్రజలలోకి తీసుకొని వెళ్తున్నారు.

తాను సిద్ధాంతపరంగా ప్రభుత్వ చేస్తున్న పనులపై విమర్శలు చేస్తే తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ప్రజలకి గట్టిగానే నమ్మిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యక్తిగత దాడి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి ఎంత సేపు దత్తపుత్రుడు, ముగ్గురు పెళ్ళాలు అనే మాటలు తప్ప వైసీపీ నాయకుల దగ్గర మరింకేమీ ఉండటం లేదా అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నాయి.

ఇక వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పడంతో పాటు టీడీపీతో పొత్తు సమీకరణాలకి తెరతీసిన పవన్ కళ్యాణ్ వైసీపీకి టెన్షన్ పెట్టాడు. జనసేనానిని ఎలా అయినా టీడీపీతో కలవకుండా ఆపాలనే వైసీపీ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఇప్పుడు ఇద్దరూ కలిసి వచ్చిన ఎదుర్కోవడానికి జగన్ తన టీమ్ ని సిద్ధం చేస్తున్నారు. ఇక జగన్ కూడా బయటకి వచ్చి సభలలో పాల్గొన్నప్పుడు తాను సింహంలా సింగిల్ గా వస్తూ ఉన్నా అని వారంతా గుంటనక్కల మాదిరిగా తన మీద దాడి చేస్తున్నారని  విమర్శలు చేశారు. అలాగే ఎప్పటిమాదిరిగా దత్తపుత్రుడు అంటూ అదే పల్లవి పాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గత మీటింగ్ లో మాట్లాడుతూ ఏపీలో క్యాస్ట్ వార్ నడుస్తుందని అన్నారు.

వైసీపీ కులాలని విభజించి రాజకీయం నడుపుతుందని విమర్శించారు. అయితే దీనికి కౌంటర్ గా జగన్ ఏపీలో జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదని క్లాస్ వార్ అని పేర్కొన్నాడు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్ లతో కౌంటర్ ఇచ్చారు. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారని అన్నారు. అలాగే ధనిక ముఖ్యమంత్రి పాలనలో తాను తప్ప అందరూ బానిసలే అని భావన వైసీపీలో ఉందని విమర్శించారు.

క్లాస్ వార్ కి జగన్ కొత్త నిర్వచనం చెప్పారని, ఓ వైపు పేదలపై పడి అన్ని విధాలుగా దోచుకుంటూ తాను పేదవాడిని అని చెప్పుకుంటూ ప్రజలని నమ్మించాలని అనుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ట్వీట్ లపై వైసీపీ మళ్ళీ భుజాలు తడుముకుంటూ పవన్ ముగ్గురు పెళ్ళాలు అంటూ మంత్రి అమర్ నాథ్ విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది.

Varalakshmi

Recent Posts

RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు!

RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…

1 day ago

Puranapanda Srinivas: ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

3 days ago

P. Sunil Kumar Reddy: మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్.!

P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…

5 days ago

Ram Charan: పెద్ది ఐటం సాంగ్ కోసం ఇంతమంది స్టార్ హీరోయిన్సా?

Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…

6 days ago

M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్?

M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…

6 days ago

Puranapanda Srinivas: మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి!

Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన…

1 week ago

This website uses cookies.