Categories: Tips

Janasena: అప్పుడే జనసేన సభకి ఆంక్షలు మొదలు

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో ఆవిర్భావ సభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే జనసేన చేపట్టే కార్యక్రమాలకి వైసీపీ పార్టీ నుంచి ఎప్పుడూ కూడా అడ్డంకులు ఉంటాయనే మాట రాజకీయ వర్గాలలో అందరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది అంటే ఆటోమేటిక్ గా సెక్షన్ 30 అమల్లోకి వస్తుంది. ఇక తాజాగా జనసేన బీసీ సంఘాలతో పాటు, కాపు సంఘాలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ అయ్యారు. ఈ రెండు మీటింగ్ లు సక్సెస్ కావడంతో పాటు కాపు, బీసీ సంఘాల నుంచి పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటుంది అనే విషయంపై స్పష్టత వచ్చింది.

జనసేన ఆవిర్భావ సభ కోసం జనసేన నాయకులు ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఅర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా సభకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో కొంత మంది కీలక నాయకులు పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు జనసేన గూటికి వచ్చారు. ఆవిర్భావ సభ కోసం కనీసం 5 లక్షల మంది ప్రజలు వస్తారని భావిస్తున్నారు. వారందరినీ అడ్డుకోవాలంటే సెక్షన్ 30 అమల్లో ఉందనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

ఎలాంటి ర్యాలీలకి అనుమతి లేదని, కేవలం సభకి మాత్రమే అనుమతి ఉందని ఎస్పీ కూడా స్పష్టం చేశారు. అయితే జనసేన ర్యాలీని అడ్డుకుంటే మాత్రం కచ్చితంగా అది రాష్ట్రంలో సంచలనంగా మారుతుంది. మరి దీని కోసం జనసేనాని ఎలాంటి ఆలోచన చేస్తారు. అలాగే సభలో పాల్గొనడానికి వచ్చేవారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. అయితే జనసైనికులు మాత్రం పోలీసులు అడ్డుకున్న కూడా ర్యాలీలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. 

Varalakshmi

Recent Posts

AP POLITICS: జగన్ హెచ్చ‌రిక‌.. ఏపీలో ‘కాక్రోచ్’ పాలిటిక్స్!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం,…

1 day ago

Politics: నాపై ఏ కేసు లేదు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మీనాక్షి నటరాజన్!

Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…

1 day ago

Eyes: కళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ వ్యాధి  లక్షణాలు కావచ్చు!

Eyes:  ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…

1 day ago

Tirumala: తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శ్రీ వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం !

Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…

1 day ago

AP POLITICS: జగన్‌కు భారీ షాక్.. అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…

2 days ago

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

2 days ago

This website uses cookies.