Devotional Tips: సాధారణంగా మనం ఏ పూజ చేసిన లేదా ఏ శుభకార్యం చేసిన ముందుగా ఆదిదేవుడు అయినటువంటి వినాయకుడికి పూజ చేస్తుంటాము. ఈ విధంగా వినాయకుడికి పూజ చేయడం వల్ల మనం చేసే కార్యం లేదా మంచి పని ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుందని భావిస్తుంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా వినాయకుడికి మొదటి పూజ చేస్తూ ఉంటారు.
ఇకపోతే చాలామంది వినాయకుడితో పాటు లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నటువంటి ఫోటోని పెద్ద ఎత్తున పూజలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇలా వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి అనే విషయాన్ని వస్తే.. సంపదకు మూల కారణం అయినటువంటి లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. అయితే ఇలా అమ్మవారిని పూజిస్తే మనకు సంపద కలుగుతుంది అయితే ఆ సంపద రావడానికి మనకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకూడదు.
ఇలా మనం కష్టపడి పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్న ఆ డబ్బు మనకి చేరే మార్గంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండడం కోసం మనం విగ్నేశ్వరుడిని పూజిస్తాము. ఇలా విగ్నేశ్వరుడికి మొదటి పూజ చేసిన తరువాతనే లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల సంపదకు ఏ మాత్రం లోటు ఉండదని అలాగే మనం చేసే ఆ పనిలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటాయని పండితులు చెబుతారు. అందుకే ఎక్కువగా లక్ష్మీదేవి వినాయకుడి చిత్రపటాన్ని తప్పనిసరిగా పూజించడం మంచిది.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.