Spirituality: సాధారణంగా మనం మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా దీపారాధన చేయటం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని ఇంట్లో ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటాము అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ దేవదేవుడి అనుగ్రహం మనపై ఉండాలని ప్రార్థిస్తూ ఉంటాము.
ఇకపోతే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత చాలామంది తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటారు అయితే పూజ చేసిన తర్వాత కొన్ని రకాల పనులను అస్సలు చేయకూడదట అలాంటి పనులు చేయడం వల్ల అంతా ఆ శుభమే కలుగుతుందని మనం పూజ చేసిన ఫలితం పోతుందని పండితులు చెబుతున్నారు. మరి పూజ చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు ఏంటి అనే విషయానికి వస్తే.. చాలామంది భర్తలు ఆఫీసుకు వెళ్లే ముందు పూజగదిని శుభ్రం చేసుకుని పూజ చేసి వెళ్తారు. తర్వాత భార్య ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది.
ఇలా దీపం చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే కనుక ఇంట్లో దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కూడా పూజ చేసిన వెంటనే చాలామంది పూజ మందిరంలో పడి ఉన్న పువ్వులు వంటి వాటిని ఊడ్చడమే కాకుండా ఇల్లు మొత్తం చీపురు పెట్టి ఊడుస్తుంటారు. ఇలా చేయడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పూజ ఫలం దక్కకపోవడం కాకుండా మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాయంత్రం కూడా దీపారాధన చేసిన తర్వాత చాలామంది పదేపదే ఇంట్లో చీపురు పెట్టి ఊడుస్తూ ఉంటారు ఇలా చేయడం మంచిది కాదు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.