Vastu Tips: మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఏ పని చేసినా కూడా శుభం కలుగుతుందని భావిస్తారు. అందుకే చేసే ప్రతి పని కూడా వాస్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి పని చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా వాస్తు శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకొని ఇంటి నిర్మాణ పనులు చేపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇంటి నిర్మించే ముందు ఇంటి గుమ్మానికి ఎదురుగా పొరపాటున కూడా ఈ మూడు వస్తువులు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంటికి ప్రధాన గుమ్మం ఎదురుగా ఎప్పుడూ కూడా నిలువు స్తంభం ఉండకూడదు. వాస్తు ప్రకారం ఇలా నిలువ స్తంభం ఉండడం వల్ల ఇంట్లోని స్త్రీ అనారోగ్య సమస్యలకు గురవుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు వాస్తు అభిప్రాయ ప్రకారం ఇంటి ముందు మెట్లు కట్టకూడదు. ఎందుకంటే ఇది ఇంట్లోని వ్యక్తులకు ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు చెట్టు ఉండకూడదు. ఎందుకంటే వాస్తు శాస్త్ర ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెట్టు ఉంటే ఇంట్లోనే వ్యక్తుల ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే ఇంటికి ఎదురుగా ఈ మూడింటిని అసలు ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్నటువంటి గుమ్మం మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అలాగే గుమ్మం దగ్గర గోర్లు కత్తిరిస్తూ ఉంటారు. మరికొందరు అక్కడే కూర్చుని తల దువ్వుతూ ఉంటారు. ఇలా గుమ్మం దగ్గర ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. అందుకే ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ఈ విధమైనటువంటి పనులు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం సమయంలో గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన పైనే ఉంటుంది.
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…
This website uses cookies.