Uttarakhand : హిందువులు చేసుకునే ప్రతి పండుగకు ఒక పురాణ కథ ఉంటుంది. ప్రతి సంవత్సరం సోదరీ, సోదరులు జరుపుకునే రాఖీ పండుగకు కూడా ఎన్నో కథలు పురాణాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా వినిపించే కథ బలిచక్రవర్తికి శ్రీ మహాలక్ష్మి రాఖీ కట్టడం. బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచివేయాలని శ్రీ మహా విష్ణువు వామనుని అవతారం ఎత్తాడు. ఆ తర్వాత బలిచక్రవర్తిని తన ద్వారపాలకుడిగా చేస్తానని శ్రీ మహావిష్ణువు వాగ్దానం చేస్తాడు. అయితే ఇంతలో తన భర్త అయిన మహా విష్ణువుని తిరిగి వైకుంఠానికి తీసుకురావాలని శ్రీ మహాలక్ష్మీ కోరుకుంటుంది. అప్పుడు నారద ముని.. కలుగచేసుకుని బలికి రక్షా బంధన్ కట్టమని లక్ష్మీదేవికి సలహా ఇచ్చాడు . ఆలా వామన అవతారం పూర్తి చేసుకుని శ్రీ మహావిష్ణువు లక్ష్మీ దేవితో కలిసి వైకుంఠానికి పయనమయ్యాడు. అలా వామన అవతారం చాలించి శ్రీ మహావిష్ణువుగా మారిన తర్వాత తన తొలి అడుగుపెట్టిన ప్రదేశమే ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా ఉర్గామ్ లోయ.
శ్రీ మహావిష్ణువు అలకనందానది ఒడ్డున బన్షీ నారాయణుడిగా కొలువుదీరాడు . ఈ ఆలయం .. 13 వేల అడుగుల ఎత్తులో బద్రీనాథ్ ధామ్కు అతి దగ్గరగా ఉంది. ఆలయంలో శివుడు, గణేశుడు, వాన్ దేవి విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ ఆలయం కేవలం రాఖీ పండుగ రోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఆరోజు మాత్రమే ఆలయం ప్రాంగణం భక్తులతో సందడిగా మారుతుంది. రాఖి పర్వదినం రోజున తలుపులు తెరిచి స్వామివారికి పూజలు చేసిన అనంతరం మహిళలు , బాలికలు రాఖీలకు పూజలు చేసి స్వామివారి సన్నిధిలో తమ సోదరులకు రాఖీలు కడతారు. అంతే కాదు రాఖీ పండుగ వేళ భక్తులు ఆలయంలో ప్రసాదం చేస్తారు. ఈ ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రసాదం తయారీ కోసం అవసరమయ్యే వెన్నను ప్రతి ఇంటి దగ్గర నుంచి సేకరించి మరీ భక్తులు ఆలయానికి తీసుకొస్తారు. .. దాంతో ప్రసాదం తయారు చేసి విష్ణువుకు సమర్పిస్తారు.
ఈ వైష్ణవాలయం ఉర్గాం గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి భక్తులు చేరుకోవాలంటే కొన్ని కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణం చేసేవారు.. హరిద్వార్ రిషికేశ్ రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాలినడకన వంశీ నారాయణ దేవాలయానికి చేరుకోవాలి. అయితే రాఖీ పండుగ రోజు మాత్రమే తెరిచే ఈ ఆలయాన్ని మీరు సందర్శించాలనుకుంటే ఆలస్యం చేయకుండా మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.