TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు పొందిన భక్తులకు ఇకపై సిఫారసు లేఖలతో గదులు ఇవ్వకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుపతిలో టోకెన్లు తీసుకున్న వారు ముందుగానే తిరుమలకు వచ్చి సిఫారసు లేఖల ఆధారంగా గదులు పొందడం, దీని వల్ల ఇతర భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు.
ఇకపై SSD టోకెన్లు తీసుకున్న భక్తులు విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్లు పొందిన అనంతరం నేరుగా తిరుమలలో దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. తిరుమలలో గదులు కావాలంటే సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందిన దూర ప్రాంతాల భక్తులకు మాత్రమే సిఫారసు లేఖల ఆధారంగా గదులు కేటాయిస్తారు. అదే విధంగా శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు ఎక్కువ గదులు తీసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ, ఇకపై కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి గదుల కేటాయింపు చేస్తారు.
భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు కూడా టీటీడీ నడుం బిగించింది. అదేవిధంగా ఆలయాల నిర్మాణానికి నిధుల మంజూరు, వేద పారాయణదారులకు భృతి, కాంట్రాక్ట్ డ్రైవర్ల క్రమబద్ధీకరణ వంటి అనేక కీలక అంశాలను ఇటీవల నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశంలో ఆమోదించారు. ఈ చర్యల వల్ల భక్తుల సంఖ్యను బట్టి మరింత సమర్థవంతంగా వసతి, దర్శన ఏర్పాట్లు చేయగలమని టీటీడీ భావిస్తోంది.
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
This website uses cookies.