TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు పొందిన భక్తులకు ఇకపై సిఫారసు లేఖలతో గదులు ఇవ్వకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుపతిలో టోకెన్లు తీసుకున్న వారు ముందుగానే తిరుమలకు వచ్చి సిఫారసు లేఖల ఆధారంగా గదులు పొందడం, దీని వల్ల ఇతర భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు.
ఇకపై SSD టోకెన్లు తీసుకున్న భక్తులు విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్లు పొందిన అనంతరం నేరుగా తిరుమలలో దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. తిరుమలలో గదులు కావాలంటే సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందిన దూర ప్రాంతాల భక్తులకు మాత్రమే సిఫారసు లేఖల ఆధారంగా గదులు కేటాయిస్తారు. అదే విధంగా శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు ఎక్కువ గదులు తీసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ, ఇకపై కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి గదుల కేటాయింపు చేస్తారు.
భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు కూడా టీటీడీ నడుం బిగించింది. అదేవిధంగా ఆలయాల నిర్మాణానికి నిధుల మంజూరు, వేద పారాయణదారులకు భృతి, కాంట్రాక్ట్ డ్రైవర్ల క్రమబద్ధీకరణ వంటి అనేక కీలక అంశాలను ఇటీవల నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశంలో ఆమోదించారు. ఈ చర్యల వల్ల భక్తుల సంఖ్యను బట్టి మరింత సమర్థవంతంగా వసతి, దర్శన ఏర్పాట్లు చేయగలమని టీటీడీ భావిస్తోంది.
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
This website uses cookies.