TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు పొందిన భక్తులకు ఇకపై సిఫారసు లేఖలతో గదులు ఇవ్వకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుపతిలో టోకెన్లు తీసుకున్న వారు ముందుగానే తిరుమలకు వచ్చి సిఫారసు లేఖల ఆధారంగా గదులు పొందడం, దీని వల్ల ఇతర భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు.
ఇకపై SSD టోకెన్లు తీసుకున్న భక్తులు విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్లు పొందిన అనంతరం నేరుగా తిరుమలలో దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. తిరుమలలో గదులు కావాలంటే సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందిన దూర ప్రాంతాల భక్తులకు మాత్రమే సిఫారసు లేఖల ఆధారంగా గదులు కేటాయిస్తారు. అదే విధంగా శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు ఎక్కువ గదులు తీసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ, ఇకపై కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి గదుల కేటాయింపు చేస్తారు.
భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణం, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు కూడా టీటీడీ నడుం బిగించింది. అదేవిధంగా ఆలయాల నిర్మాణానికి నిధుల మంజూరు, వేద పారాయణదారులకు భృతి, కాంట్రాక్ట్ డ్రైవర్ల క్రమబద్ధీకరణ వంటి అనేక కీలక అంశాలను ఇటీవల నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశంలో ఆమోదించారు. ఈ చర్యల వల్ల భక్తుల సంఖ్యను బట్టి మరింత సమర్థవంతంగా వసతి, దర్శన ఏర్పాట్లు చేయగలమని టీటీడీ భావిస్తోంది.
Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…
Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
This website uses cookies.