Tirumala VIP Break: కలియుగ దైవం అయిన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరుకుంటున్నారు. వేసవి సెలవులు పూర్తి అయినప్పటికీ వారాంతం కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే భక్తుల దర్శనార్థం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దర్శన విషయాలలో పలుకీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం విఐపి బ్రేక్ దర్శనాలను నిలిపి వేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ఇందుకు అనుకూలంగా తిరుమల ప్లాన్ చేసుకోవడం మంచిది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకు స్వామివారి దర్శనం ఎక్కువగా కల్పించాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సోమవారం నిర్వహించే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు ఆ రోజు శ్రీవాణి దర్శన టికెట్ల జారీని కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగానే భక్తులు వారి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఆదివారం వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోమని స్పష్టం చేసింది.
ప్రతి రోజు ఆన్లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్లను సోమవారం జారీ చేయబోమని వెల్లడించింది. ఇలా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం వల్ల సామాన్యులకు స్వామివారి దర్శనం మరింత వేగంగా కల్పించే అవకాశం ఉంటుంది. ఇక తిరుమలలో రద్దీ విషయానికి వస్తే ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.బయట ఏర్పాటు చేసిన క్యూలైన్లు కూడా బాలాజీ నగర్ వరకు విస్తరించాయి. వేలాది మంది భక్తులు ఇప్పటికే శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇలా భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలోనే సోమవారం విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
Vitamin D Deficiency: మనం ఆరోగ్యవంతంగా ఉంటూ మన రోజు వారి పనులు ఏ విధమైనటువంటి అలసట లేకుండా ఉండాలి…
Retro Walk: ఇటీవల కాలంలో మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయడం అనేది సర్వసాధారణం అయింది.…
Shani Trayodashi 2026: మన హిందు సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించే వాటిలో శని త్రయోదశి కూడా ఒకటి.…
Health Tips: అమ్మాయిలు ఎంత అందంగా తయారైన వారి అందాన్ని రెట్టింపు చేసేది మాత్రం పెదాలు అని మాత్రమే చెప్పాలి.…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇప్పటికే టీటీడీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? నందమూరి తారకరామారావు లెగసీని, నందమూరి బాలకృష్ణ…
This website uses cookies.