Categories: LatestNewsPolitics

TDP: టీడీపీ వైపే ప్రజానీకం… ఎమ్మెల్సీ ఎన్నికలతో మారిన లెక్కలు

TDP: ఏపీ రాజకీయాలలో ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో గెలవడం ద్వారా మరల ప్రజాక్షేత్రంలో తన బలాన్ని నిరూపించుకుంది. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో 23 స్థానాలే వచ్చిన కూడా ఈ నాలుగేళ్ళలో జగన్ పాలనపై ప్రజలలో ఎంత వ్యతిరేకత పెరిగింది అనేది అందరికి తెలిసిందే. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి అనేది ఏపీలో జరగడం లేదు. అయితే చంద్రబాబు  ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలనుకున్న అమరావతిని కూడా మూడు రాజధానుల అజెండాతో వైసీపీ పక్కన పెట్టింది.

ఇక రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పటికి ఏపీ ఉంది. ఇది ప్రజలలో వైసీపీపై వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యింది. అలాగే చంద్రబాబు హయాంలో పెట్టుబడులు విపరీతంగా వస్తూ ఉండేవి. తన అడ్మినిస్ట్రేట్ స్కిల్ తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో సాంకేతిక విజ్ఞానంలో ముందుకి వెళ్ళేలా చేసారు. చంద్రబాబు వేసిన పునాదుల మీద ఈ రోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయి విస్వనగరంగా మారింది. ఇక అమరావతిని కూడా చంద్రబాబు అలాగే అభివృద్ధి చేయలని అనుకున్నారు.

అయితే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలలోకి వెళ్ళిన జగన్ కి సానుభూతితో ప్రజలు పట్టం కట్టారు. అయితే ఈ నాలుగేళ్లలో జగన్ పాలనపై విసిగిపోయిన ప్రజలు మరల చంద్రబాబు అనుభవం వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అనేది తాజాగా జరిగిన పట్టభద్రుల ఎన్నికలలో స్పష్టంగా తెలిసింది. రానున్న రోజుల్లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. భారీ మెజారిటీతో టీడీపీ అధికారంలోకి తెచ్చే దిశగా చంద్రబాబు వేస్తున్న వ్యూహాత్మక ఎత్తులలో జగన్ కి అప్పుడే టెన్షన్ మొదలైంది. దీంతో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఎమ్మెల్యేలని బుజ్జగించె ప్రయత్నాలు మొదలు పెట్టారు అనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. 

Varalakshmi

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.