SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ భూమీ పడ్నేకర్ ఓ కథానాయికగా నటించబోతుందని ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ఇందులో మేయిన్ హీరోయిన్గా నటిస్తున్న పూజా హెగ్డే తప్పుకుందా..? అనే సందేహాలు మొదలయ్యాయి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అతడు, ఖలేజా లాంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాకపోయినా స్మాల్ స్క్రీన్ మీద మాత్రం ప్రేక్షకులను బాగా అలరించాయి. ఎప్పుడు టీవీలో వచ్చినా ఈ సినిమాలు మంచి టీఆర్పీ రేటింగ్ను నమోదు చేశాయి. దాంతో ఈ కాంబోలో మూడవ సినిమా అంటే అందరిలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక త్రివిక్రమ్ సినిమా అంటే తెరనిండా నటీనటుడు మంచి పాత్రలతో సందడి చేస్తారు. అలాగే ఈ సినిమాలోనూ హీరోయిన్స్గా పాన్ ఇండియా స్టార్ పూజా హెగ్డే, మరో క్రేజీ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పుడు మూడవ హీరోయిన్గా బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీ పడ్నేకర్ కూడా నటించబోతుందని తాజా సమాచారం. భూమికి హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. అదే క్రేజ్తో ఈ ఛాన్స్ దక్కించుకుందని టాక్. అంతేకాదు, త్రివిక్రమ్ మహేష్ 28వ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాట. అందులో భాగంగానే భూమీ పడ్నేకర్ను మరో హీరోయిన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానున్నట్టు సమాచారం.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.