SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ భూమీ పడ్నేకర్ ఓ కథానాయికగా నటించబోతుందని ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ఇందులో మేయిన్ హీరోయిన్గా నటిస్తున్న పూజా హెగ్డే తప్పుకుందా..? అనే సందేహాలు మొదలయ్యాయి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అతడు, ఖలేజా లాంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాకపోయినా స్మాల్ స్క్రీన్ మీద మాత్రం ప్రేక్షకులను బాగా అలరించాయి. ఎప్పుడు టీవీలో వచ్చినా ఈ సినిమాలు మంచి టీఆర్పీ రేటింగ్ను నమోదు చేశాయి. దాంతో ఈ కాంబోలో మూడవ సినిమా అంటే అందరిలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక త్రివిక్రమ్ సినిమా అంటే తెరనిండా నటీనటుడు మంచి పాత్రలతో సందడి చేస్తారు. అలాగే ఈ సినిమాలోనూ హీరోయిన్స్గా పాన్ ఇండియా స్టార్ పూజా హెగ్డే, మరో క్రేజీ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పుడు మూడవ హీరోయిన్గా బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీ పడ్నేకర్ కూడా నటించబోతుందని తాజా సమాచారం. భూమికి హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. అదే క్రేజ్తో ఈ ఛాన్స్ దక్కించుకుందని టాక్. అంతేకాదు, త్రివిక్రమ్ మహేష్ 28వ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాట. అందులో భాగంగానే భూమీ పడ్నేకర్ను మరో హీరోయిన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానున్నట్టు సమాచారం.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…
Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని…
This website uses cookies.