Facebook: సోషల్ మీడియా టెక్ కంపెనీలు తమ ఆదాయ మార్గాలని మరింతగావిస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్విట్టర్ తన సైట్ లో బ్లూ టిక్ మార్క్ కోసం ప్రత్యేకంగా రుసువు అమల్లోకి తీసుకొచ్చింది. సబ్ స్క్రైబ్ చేసుకుంటేనే బ్లూ టిక్ మార్క్ అనేది ఇస్తారు. అయితే వ్యక్తిగతంగా దీనికోసం ఒక్కో వ్యక్తి నుంచి వసూలు చేస్తున్న మొత్తం తక్కువగానే ఉన్నా కూడా మొత్తం చూసుకుంటే వేల కొట్లలో ఆదాయం ఆయా టెక్ కంపెనీలకి వచ్చిపడనుంది. ట్విట్టర్ ని సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
తమ విస్తృత ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని బ్లూ టిక్ మార్క్ లో తమని తాము రిప్రజెంట్ చేసుకుంటారు. అయితే గతంలో ఉచితంగా ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్ ఆయా వ్యక్తులకి సొసైటీలో వారికున్న ఫాలోయింగ్ బట్టి ఇచ్చేది. అయితే ఇప్పుడు ఎలాన్ మాస్క్ వచ్చిన తర్వాత బ్లూ టిక్ మార్క్ ఖరీధైపోయింది. సుమారు వెయ్యి రూపాయిల వరకు ప్రతి నెల బ్లూ టిక్ మార్క్ సబ్ స్క్రైబ్ కోసం వసూలు చేస్తున్నారు. అలాగే ఏడాది మొత్తానికి ఒకేసారి సబ్ స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
ఇప్పుడు ఈ బాటలో పేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. పేస్ బుక్ లో బ్లూ టిక్ మార్క్ కావాలని కోరుకునే వారు ఇకపై ఏడాదికి 12000 చందా చెల్లించాల్సిందే అని కొత్త నిబంధనని తీసుకొచ్చింది. నెలవారీగా కూడా సబ్ స్క్రైబ్ చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే ఐ ఫోన్ వినియోగదారులకి నెలకి 12 వందల రూపాయిలు బ్లూ టిక్ మార్క్ కోసం వసూలు చేస్తే ఆండ్రాయిడ్ వినియోగదారులకి మాత్రం 1000 రూపాయిలు మాత్రమే ఛార్జ్ చేస్తుంది. ఈ షబ్ స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఇకపై బ్లూ టిక్ మార్క్ అప్షన్ ఉంటుందని అధికారికంగా ప్రకటించింది.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.