YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసిపి మరల 2024 ఎన్నికలలో గెలవడానికి వ్యూహాలు వేసుకుంటూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తోంది. ఇప్పటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను అధికార పార్టీ నిర్వహిస్తోంది. గ్రామ సారధులను ఏర్పాటు చేసుకొని ఇంటింటికి వెళ్లి తమ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ అధికార పార్టీ ఉద్యోగాల కల్పన, పారిశ్రామికీకరణ, అభివృద్ధి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రజలలో కూడా వైసిపిపై కొంత నెగిటివ్ టాక్ ఉంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్ కి మరో రూపంలో కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఇప్పటికే నియోజకవర్గాలలో కొత్త నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైసీపీ నుంచి పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా, సీనియర్ నాయకులుగా ఉన్న వారు తమ వారసులను బరిలోకి దించాలని భావిస్తున్నారు. రాయలసీమలో చంద్రగిరి నియోజకవర్గం ఎమెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని ప్రకటించారు. అలాగే మచిలీపట్నంలో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీ చేస్తారంటూ ప్రచారం నడుస్తోంది. బొత్స సత్యనారాయణ తనయుడు కూడా ఎమ్మెల్యేగా 2024 లో ఎంట్రీ ఇవ్వ్వాలనే ఆలోచనతో ఉన్నారు.
వైసీపీలో ఇలా మొత్తం 40 మంది వరకు వారసులు అరంగేట్రం చేయడానికి ఆశపడుతున్నారు. నాయకులు కూడా తమ కొడుకులు లేదా కూతుళ్లకు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకోవడానికి విశ్వం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో జగన్ కాస్త ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ వారసులకు ఎమ్మెల్యే సీట్లు ఖరారు చేసి ఇస్తే వారు ఎంతవరకు ప్రభావం చూపిస్తారనేది అర్థం కాని విషయం. ప్రజల్లోకి వారు బలంగా వెళ్లలేకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది మరి దీనిపై ఫైనల్ గా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
This website uses cookies.