Categories: LatestNewsPolitics

YSRCP: వారసులతో వైసిపి కొత్త తలనొప్పి

YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసిపి మరల 2024 ఎన్నికలలో గెలవడానికి వ్యూహాలు వేసుకుంటూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తోంది. ఇప్పటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను అధికార పార్టీ నిర్వహిస్తోంది. గ్రామ సారధులను ఏర్పాటు చేసుకొని ఇంటింటికి వెళ్లి తమ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ అధికార పార్టీ ఉద్యోగాల కల్పన, పారిశ్రామికీకరణ, అభివృద్ధి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రజలలో కూడా వైసిపిపై కొంత నెగిటివ్ టాక్ ఉంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్ కి మరో రూపంలో కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఇప్పటికే నియోజకవర్గాలలో కొత్త నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైసీపీ నుంచి పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా, సీనియర్ నాయకులుగా ఉన్న వారు తమ వారసులను బరిలోకి దించాలని భావిస్తున్నారు. రాయలసీమలో చంద్రగిరి నియోజకవర్గం ఎమెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని ప్రకటించారు. అలాగే మచిలీపట్నంలో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీ చేస్తారంటూ ప్రచారం నడుస్తోంది. బొత్స సత్యనారాయణ తనయుడు కూడా ఎమ్మెల్యేగా 2024 లో ఎంట్రీ ఇవ్వ్వాలనే ఆలోచనతో ఉన్నారు.

ys-jagan-next-election-campaign-struggle

వైసీపీలో ఇలా మొత్తం 40 మంది వరకు వారసులు అరంగేట్రం చేయడానికి ఆశపడుతున్నారు. నాయకులు కూడా తమ కొడుకులు లేదా కూతుళ్లకు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకోవడానికి విశ్వం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో జగన్ కాస్త ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ వారసులకు ఎమ్మెల్యే సీట్లు ఖరారు చేసి ఇస్తే వారు ఎంతవరకు ప్రభావం చూపిస్తారనేది అర్థం కాని విషయం. ప్రజల్లోకి వారు బలంగా వెళ్లలేకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది మరి దీనిపై ఫైనల్ గా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. 

Varalakshmi

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

21 hours ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

21 hours ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

2 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

2 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

3 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

3 days ago

This website uses cookies.