Spirituality: మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో రకాల వస్తువులను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల వస్తువులను మనం తెలిసి తెలియక కూడా కింద పెట్టకూడదు మన పురాణాల ప్రకారం ఈ వస్తువులను కింద పెట్టడం వల్ల చెడు ఫలితాలను పొందుతారని చెబుతున్నాయి. మరి శాస్త్రం ప్రకారం ఎలాంటి వస్తువులను కింద పెట్టకూడదు ఏంటి అనే విషయానికి వస్తే..
హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది. జంధ్యాన్ని తల్లిదండ్రులు, గురువులకు ప్రతి రూపంగా భావిస్తారట. అందువలన జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందట. అందుకే పొరపాటున కూడా జంధ్యం క్రింద పెట్టకూడదని పెద్దలు అలాగే శాస్త్రం చెబుతోంది.
శివలింగం అలాగే నేపాల్లోని గండకీ నది తీరంలో ఓ రకమైన నల్ల రాయి సాలిగ్రామంను ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడదు. సాలిగ్రామంను విష్ణువుకు ప్రతిరూపమని చెబుతారు. వీటిని క్రింద పెట్టడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
దేవుడి ముందు పెట్టే దీపాలను నేలపై పెట్టరాదు. వాటిని వెలిగించినా, వేలిగించక పోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి కానీ ఎప్పుడు కూడా నేలపై పెట్టరాదు. ఇక బంగారాన్ని కూడా ఎప్పుడు కూడా నేలపై పెట్టకూడదు బంగారం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కనుక నేలపై ఉంచరాదు వీటితోపాటు శంఖాన్ని కూడా నేలపై ఉంచరాదు.
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…
This website uses cookies.