Janasena-BJP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల లక్ష్యంగా అన్ని పార్టీలు ఎవరికి వారుగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రజాక్షేత్రంలోకి ఇప్పటికీ అధికార పార్టీ వైసిపి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు వెళ్లిపోయాయి. ఇంకా మూడవ ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీ మాత్రం పొత్తుల వ్యూహాలతో, కమలంతో కుస్తీలు పడుతూ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు వరుసగా సినిమా షూటింగ్ లు పెట్టుకుని బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారంలో భాగస్వామ్యం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమతో పొత్తులో ఉన్న బిజెపి పార్టీని కూడా వెంట తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. గత నెలలో ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు.
అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దృష్టి మొత్తం కర్ణాటక ఎన్నికలపై ఉంది. ఈసారి కర్ణాటక ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. దానికోసం ఉన్న అన్ని మార్గాలను వెతుకుతోంది. ఇప్పటికే కన్నడ స్టార్ సుదీప్ భారత జనతా పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయడానికి ఒప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్న నేపథ్యంలో అతనిని కూడా కర్ణాటక ఎన్నికలలో స్టార్ క్యాంపైనర్ గా ఉపయోగించుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో బిజెపి యువ నాయకుడుగా ఉన్న తేజస్వీ సూర్య పవన్ కళ్యాణ్ తో కలిసి దీనిపై మంతనాలు చేయడం జరిగిందని సమాచారం.
ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కేంద్రంలోని పెద్దలతో చర్చించడం కూడా జరిగింది. 2014 కాంబినేషన్ రిపీట్ చేద్దామని పవన్ కళ్యాణ్ వారిని కోరినట్లుగా టాక్. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేద్దామని వారు సూచించినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. పొత్తుల పైన కూడా అప్పుడు నిర్ణయాలు తీసుకుందామంటూ దాటవేశారంట. అలాగే కర్ణాటక ఎన్నికలలో బిజెపి తరఫున ప్రచారం చేయాలని కోరినట్లుగా సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం బిజెపి పెద్దలకు చెప్పలేదని తెలుస్తోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎన్నికలలో ప్రచారం చేయడం ద్వారా అధికారంలోకి వస్తే అప్పుడు ఏపీలో బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ సూచించిన దారిలో పెళ్లి అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది వేచి చూడాలి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.