Health: ప్రస్తుత దైనందిన జీవితంలో మానసిక ఒత్తిళ్లకి గురయ్యే వారి సంఖ్య బాగా ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న కారణాలకి కూడా కొంత మంది డిప్రెషన్ కి లోనవుతూ ఉంటారు. రోజువారీ జీవన విధానంలో సంతోషకరమైన జీవితాన్ని సాగించాలంటే అన్ని ఎమోషన్స్ మన కంట్రోల్ లో ఉండాలనేది మానసిక నిపుణులు చెప్పే మాట. ఏ ఎమోషన్ కూడా స్థాయికి మించి ఉండకూడదు అని అంటారు. అలా మన భావోద్వేగాల్ని నియంత్రణలో ఉంచుకునే సామర్ధ్యం ఉన్నప్పుడే జీవితంలో ఎదురయ్యే అన్ని ఒడిదుడుకులని తట్టుకునే శక్తి ఉంటుంది.
అయితే పెరిగిన వాతావరణమో, చుట్టూ ఉన్న మనుషుల ప్రభావమో కానీ కొంతమందిలో ఈ ఎమోషన్స్ నియంత్రించుకునే సామర్ధ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇలా కంట్రోల్ లో లేని ఎమోషన్స్ కారణంగా ఒక్కోసారి ప్రమాదాల బారిన పడతాము, కోపం, ద్వేషం ఎక్కువైతే నచ్చని వ్యక్తులని, గొడవ పడేవారిని చంపేయాలనే ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలతో ప్రమాదాలలో చిక్కుకుంటాం. ఇక కొంతమందిలో ఆత్మన్యూనత, భయం ఎక్కువగా ఉంటుంది.
చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం, అడిగిందే మళ్ళీ మళ్ళీ అడగడం చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా మాట్లాడే సమయంలో అస్సలు కాన్సంట్రేషన్ చేయరు. ఎంత ప్రాధాన్యత ఉన్న విషయాన్ని చెప్పిన కూడా వారి మనసు పెట్టి వినే ప్రయత్నం చేయరు. అలాగే నవ్వు కూడా చాలా కృత్రిమంగా ఉంటుంది. ఒంటరితనంలో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. పదిమందిలో ఉన్న కూడా ఒంటరి అనే ఫీలింగ్ వారి కళ్ళల్లో కనిపిస్తుంది. కలివిడిగా ఉండలేరు. అలాగే చావు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే వారు తీవ్రమైన డిప్రెషన్ లోనే ఉన్నారని అర్ధం చేసుకోవాలి. ఇలాంటి డిప్రెషన్ లో ఉంటే వీలైనంత వేగంగా సైకోథెరఫీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే అది మరింత పెరిగి మరణం అంచులకి తీసుకెళ్తుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.