Technology: ట్విట్టర్కు కొత్త బాస్గా బాధ్యతలను చేపట్టిన వెంటనే హుటా హుటిన 3వేలకు పైగా మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించి ఇంటికి సాగనంపాడు ఎలాన్ మస్క్. అయితే అది పెద్ద తప్పని తెలుసుకున్నాడు కాబోలు వెంటనే దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టాడు. ఉద్యోగుల తొలగింపు తరువాత ఏర్పడిన గందోరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకోసం తొలగించిన వారిలో కొంత మంది ఉద్యోగులను తిరిగి రావాలని ఎలాన్ వేడుకుంటున్నాడట.
ట్విట్టర్లో ఏకంగా 3,700 మంది ఉద్యోగులను తొలగించిన ఎలోన్ మస్క్, నిర్ణయాలు తీసుకునే విషయంలో తాను తప్పటడుగు వేస్తాడని మరోసారి నిరూపించాడు. శుక్రవారం చాలా మంది ట్విటర్ ఉద్యోగులు కంపెనీకి చెందిన వివిధ వెబ్సైట్ల నుండి మస్క్ యొక్క ట్విట్టర్ లేఆఫ్ ప్లాన్లో భాగంగా వారి ఉపాధిని రద్దు చేసినట్లు తెలుసుకున్నారు. అయితే ఆ తరువాత, ఆశ్చర్యకరమైన మలుపులో భాగంగా డజన్ల కొద్దీ ట్విట్టర్ ఉద్యోగులు పొరపాటున తొలగించబడ్డారని, ఈమెయిల్స్ విషయంలో కొన్ని తప్పులు దొర్లాయని , మస్క్ యొక్క కొత్త ట్విటర్ ప్లాన్ల అమలు కోసం మీ సేవలు అవసరం అని కొంత మంది ఉద్యోగులకు మరోసారి మెయిల్స్ పంపించినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ను సోషల్ మీడియాలో టాప్ ప్లేస్లో నిలబెట్టాలని భారీ ప్లాన్లు వేస్తున్నాడు ఎలాన్. ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికను తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే తన ప్లాన్స్ సవ్యంగా సాగాలంటే నిపుణులైన ఎంప్లాయిస్ అవసరం. అయితే ఎలాన్ తొలగించిన ఉద్యోగుల్లో నైపుణ్యత కలిగినవారు లేకపోలేదు. ఈ క్రమంలో వారి సహాయం తన అప్కమింగ్ ప్లాన్స్ను ముందుకు తీసుకెళ్లేందుకు చాలా అవసరం. అందుకే మెయిల్స్ ద్వారా ఎంప్లాయిస్ను తిరిగి విధుల్లోకి రమ్మన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఎంత మంది తిరిగి విధుల్లోకి తిరిగి వస్తారు అన్నది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. అసలు వారినే పిలుస్తారా? లేదా కొత్తవారిని తీసుకుంటారా అనే విషయంపైన ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయం తెలియాలంటే ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.