Wed. Jan 21st, 2026

    Pooja Room: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా దీపారాధన చేయటం వల్ల ఎంతో శుభం కలుగుతుంది ఆ ఇంటి పై సకల దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేస్తూ ఉంటాము అయితే దీపారాధన చేయడం కోసం పూజ గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. చాలామంది పూజ గదికి తలుపులు కూడా ఏర్పాటు చేసుకొని ఉంటారు.

    should-the-door-of-the-puja-gadi-be-kept-open-or-keep-it-closed
    should-the-door-of-the-puja-gadi-be-kept-open-or-keep-it-closed

    ఇలా పూజ చేసిన తర్వాత పూజ గదికి ఉన్నటువంటి తలుపులను మూసేయవచ్చా లేదా తెరిచే ఉంచాలా అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతూ ఉంటాయి. మరి పూజ చేసిన తర్వాత పూజగది విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పూజ చేస్తున్న తర్వాత వెంటనే పొరపాటున కూడా పూజగదికి తలుపులు వేయకూడదు కొంత సమయం ఉంచిన తర్వాత తలుపులు మూసుకోవచ్చు కానీ వెంటనే తలుపులు మూయకూడదు. ఇక మనం వెలిగించిన దీపాలు ఆరిపోతున్నాయన్న క్రమంలో మాత్రమే తలుపులు వేయాలి.

    ఇక పూజ గదిలో ఎక్కువగా రాగి వస్తువులు ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ దేవుడి విగ్రహాలను మాత్రం పెట్టుకోకూడదు. దేవుడి ఫోటోలను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ విగ్రహాలను ఏర్పాటు చేయకూడదు. అదేవిధంగా పూజ గది ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి తప్ప చిందరవందరగా ఉండకూడదు. ఇకపోతే స్వామివారికి ఎల్లప్పుడూ శుభ్రమైనటువంటి పువ్వులను పెట్టాలి ఎప్పుడు వాడిపోయిన పువ్వులను పెట్టకూడదు అదేవిధంగా దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలను పొరపాటున కూడా పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.