Shani dosha Nivaran: సాధారణంగా శని దోషం నుండి విముక్తి పొందటానికి అనేక రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శని దోష నివారణకు ప్రతి శనివారం రోజు శని దేవుడి పూజ చేస్తూ ఉంటారు. కానీ మనం తినే నేరేడు పండ్లు కూడా శని దోష నివారణకు ఎంతో ఉపయోగపడతాయి. సాధారణంగా నేరేడు పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేరేడు పండ్లు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా మూత్ర సంబంధమైన వ్యాధుల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నేరేడు పండ్లు శని దేవుడికి చాలా ప్రీతికరమైనది. అందువల్ల నేరేడు పనులను శని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత వాటిని బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శని దేవుడికి నైవేద్యంగా పెట్టిన నేరేడు పండ్లను నల్ల నువ్వులతో కలిపి బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల శని దోషం తొలగిపోవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.అంతే కాకుండా నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేయటం వల్ల భూదానం చేసినంత ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టిన నేరేడు పండ్లను బిచ్చగాళ్ళకు దానం చేయటం వల్ల మనకి ఉన్న దరిద్రం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.అలాగే ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు భోజనంతోపాటు నేరేడు పండ్లను కూడా వడ్డిస్తే మీ ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు. అంతే కాకుండా దేవుడి ముందు పడమర దిక్కున ఇనుప గరిటెలో దీపాన్ని పెట్టి నేరేడు పండు నైవేద్యంగా పెడితే ఆ దేవుడి అనుగ్రహం లభించి పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతున్నారు. అందువల్ల శని దోషం వల్ల సమస్యలతో సతమతమవుతున్న వారు నేరేడు పండ్లను శనిదేవుడికి నైవేద్యంగా పెట్టి దానం చేయటం వల్ల శని దోషం నుండి విముక్తి పొందవచ్చు.
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
This website uses cookies.