Seerat Kapoor: రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ సీరత్ కపూర్. ఈ అమ్మడు డాన్సర్ మాస్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే అనూహ్యంగా తెలుగులో రన్ రాజా రన్ సినిమాలో శర్వానంద్ కి జోడీగా నటించే ఛాన్స్ ని సొంతం చేసుకొని హీరోయిన్ అయిపొయింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తుంది.
తరువాత సందీప్ కిషన్ టైగర్ మూవీలో హీరోయిన్ గా నటించింది. సుమంత్ అశ్విన్ కి జోడీగా కొలబంస్ సినిమాలో నటించింది. రాజుగారి గది 2లో కూడా సీరత్ కపూర్ నటించింది. ఈ సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా ఆమె పాత్ర ఉంటుంది.అల్లు శిరీష్ కి జోడీగా ఒక్క క్షణం అనే మూవీలో కూడా ఈ అమ్మడు ఆదిపాడింది.
ఇలా తెలుగులో ఆమె చేసిన అన్ని సినిమాలలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలే లభించాయి. రవితేజకి జోడీగా టచ్ చేసి చూడు సినిమాలో కూడా సీరత్ కపూర్ నటించింది. ఇక చివరిగా సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలలో సీరత్ కపూర్ నటించింది.
ఆ సినిమా తర్వాత మరల తెలుగులో ఇప్పటి వరకు ఈ అమ్మడు కనిపించలేదు. రెండేళ్ళ పాటు సీరత్ కపూర్ ఎవరి దృష్టిలో పడలేదు అని చెప్పాలేదు. సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ గా లేదు. మరల చాలా గ్యాప్ తర్వాత తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ అయ్యింది. అయితే ఆమె అప్డేట్స్ ఇస్తూ ఉన్న తెలుగు ప్రేక్షకులు మాత్రం సీరత్ కపూర్ పై దృష్టి పెట్టలేదు.
ఇదిలా ఉంటే ఎప్పుడూ కూడా మోడరన్ గా కనిపించే సీరత్ కపూర్ మొదటి సరి ట్రెడిషనల్ లుక్ లో చీరకట్టులో దర్శనం ఇచ్చింది. ఈ చీరలో సీరత్ మరింత గ్రాండ్ గా కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా కర్లింగ్ హెయిర్ తో కనిపించే అమ్మడు ఇలా చీరకట్టుగా కనిపించేసరికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.