Nayanthara : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అంటే మొదట గుర్తొచ్చే పేరు నయనతార. ఎన్నో విజయవంతమైన సినిమాలతో సినీ ప్రేమికులను మెప్పించిన ఆమె, గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ విఫలమైనప్పటికీ దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి 2022లో వైవాహిక జీవితం ప్రారంభించింది. వీరికి కవల పిల్లలూ ఉన్నారు.
అయితే వివాహానంతరం ఆమె జీవితం అంతగా సజావుగా సాగడం లేదన్న ఊహాగానాలు పలు సందర్భాల్లో వినిపించాయి. ఇప్పటికే సరోగసి వివాదం, అన్న పూరణి సినిమా వివాదం వంటి సంఘటనలు ఆమె చుట్టూ కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ముందుగానే “నయనతారకు పెళ్లి తర్వాత కష్టాలు తప్పవు, విడాకుల బాట పడతారు” అని చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి.
తాజాగా ఆమె షేర్ చేసిన షాకింగ్ పోస్ట్
నయనతార తన ఇన్స్టాగ్రామ్ లో తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ పోస్ట్ లో ఆమె ఇలా రాశారు:
“తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది జీవితపు పెద్ద తప్పు అవుతుంది. భర్త చేసే తప్పులకు భార్య ఎందుకు బాధ్యత వహించాలి? పురుషులు సాధారణంగా మేచ్యూర్ ఉండరు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి… నేను మీ వల్ల ఇప్పటికే చాలా ఎదుర్కొన్నాను.”
ఈ పోస్ట్ ద్వారా ఆమె ఎవరి గురించి మాట్లాడిందన్నదానిపై స్పష్టత లేకపోయినా… విఘ్నేష్ శివన్పై నయనతార ఈ పోస్ట్ చేశారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
విడాకులు ఖాయమేనా?
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “వైవాహిక జీవితంపై ఇలాంటి నెగటివ్ పోస్ట్ చేయడం అంటే ఏదో ఉందనుకోవాలి” అంటున్నారు కొందరు.
అయితే మరోవైపు ఈ పోస్ట్ ఫిలాసఫికల్ కోటేషన్గా కూడా చూడవచ్చని, వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేదని చెబుతున్నారు.
ఇప్పటివరకు స్పష్టత లేదు
నయనతార లేదా విఘ్నేష్ శివన్ నుంచి ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ పోస్ట్ వల్ల ఒకప్పుడు “పర్ఫెక్ట్ కపుల్” అనిపించిన నయన్-విఘ్నేష్ జంట భవిష్యత్తుపై సందేహాలు ఏర్పడుతున్నాయి.
నయనతార ఇటీవల షేర్ చేసిన పోస్ట్ ఆమె వ్యక్తిగత జీవితంలో ఏదైనా మార్పునకు సంకేతమా? లేక ఇది కేవలం భావోద్వేగపు వ్యక్తీకరణేనా? అన్నది తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడేవరకు ఇది చర్చనీయాంశంగానే మిగులుతుంది.
saliva on Sleeping: సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో నోటి నుంచి మనకు తెలియకుండానే లాలాజలం వస్తుంటుంది. ఇలా లాలాజలం కారణంగా…
Tirumala SSD Tokens: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తిరుమల చేరుకుంటున్నారు.…
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…
This website uses cookies.