Technology: మన దేశంలో వాయు కాలుష్యం తీవ్రమైన సమస్యగా మారింది. పెరుగుతున్న ఆటోమొబైల్ వినియోగదారులతో, భారతదేశంలో వాయు కాలుష్యం స్థాయి మితిమీరి మరీ పెరిగిపోతోంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రకారం, రవాణా వనరులు భారతదేశంలోని రేణువుల కాలుష్యంలో దాదాపు మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నాయని నిర్ధారించింది. 2020లో, భారతదేశం ప్రపంచంలో అత్యంత కలుషితమైన దేశంగా 3వ స్థానంలో నిలిచింది, ఇందులో ఆటోమొబైల్స్ ప్రధాన పాత్రను పోషించాయి.
భారతదేశంలో EV కదలికను వేగవంతం చేయడానికి ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ, చాలా మంది ప్రజలు పెరుగుతున్న కాలుష్యంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు సరికదా వారి వాహన కాలుష్యాన్ని సమయానికి తనిఖీ చేయించకపోవడం వల్లే ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, గురుగ్రామ్ ఆధారంగా ఓ ఈ పొల్యూషన్ అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులకు వారి వాహన కాలుష్యం గడువు ముగియబోతుందని తెలియజేయడంతో పాటు యాప్ ద్వారా దాన్ని పూర్తి చేయడానికి వారికి సౌకర్యాన్ని కల్పిస్తోంది.
వాయు కాలుష్యానికి వాహనాలు అత్యంత సాధారణ కారణం. 5 మిలియన్ల కంటే ఎక్కువ వాహనాలు వాటి వద్ద చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ చెక్ సర్టిఫికేట్ లేనందుకు జరిమానా విధించబడ్డాయి. ఇదంతా ఎందుకంటే 10 మందిలో 9 మందికి వారి PUC గడువు తేదీ గుర్తుండదు. వారు సమయానికి కాలుష్య తనిఖీని పొందడం మర్చిపోతారు, ఫలితంగా చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్ లేనందుకు ట్రాఫిక్ పోలీసులచే జరిమానా విధించబడుతుంది. అంతే కాదు వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి, ప్రజలు తమ PUC సర్టిఫికేట్ స్టేటస్ ను అప్డేట్ చేయడం కోసం, వారి నిర్లక్ష్యానికి జరిమానా విధించబడకుండా ఉండటానికి, ఆదిత్య , శిఖర్ లు ఈ పొల్యూషన్ను ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ కంపెనీ దాని బీటా వెర్షన్ ద్వారా పనిచేస్తోంది. ఇంకా యాప్ యొక్క ఆన్డ్రాయిడ్, iOS వెర్షన్లను ప్రారంభించలేదు. త్వరలో వినియోగదారులు యాప్ నుండి PUC సర్టిఫికేట్ కోసం వారి స్లాట్ను బుక్ చేసుకోగలిగే వెసులుబాటును కల్పించనున్నారు. ఈ స్టార్టప్ ప్రస్తుతం గురుగ్రామ్ ప్రాంతంపైనే దృష్టిసారించింది. ఆ ప్లాట్ఫారమ్లో ఎక్కువ మంది వినియోగదారులతో, ఈ పొల్యూషన్ త్వరలో మరిన్ని నగరాలకు విస్తరిస్తుందని వ్యవస్థాపకులు తెలిపారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం,…
Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…
Eyes: ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
This website uses cookies.