Prashanth Varma : కథ మీద పట్టు, తీసే స్టోరీ పై క్లారిటీ ఉండలే గాని ఎవరైనా సరే అద్భుతమైన చిత్రాలను తీయగలరని నిరూపించాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇన్నాళ్లు చిన్న చిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ ఎవరూ ఊహించని విధంగా సూపర్ హీరో సినిమాను ఆత్యద్భుతంగా తీసి నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలను సైతం పక్కకు నెట్టి భారీ వసూళ్లను రాబట్టింది మూవీ. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హనుమాన్ మూవీ ఏకంగా 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఇక హనుమాన్ విజయం గురించి పక్కకు పెడితే ఈ సినిమాతో ఫుల్ ఫేమస్ అయిపోయాడు యువ డైరెక్టర్ ప్రశాంత్. దీనితో ప్రశాంత్ వర్మ మీద రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్నటికి మొన్న దర్శక ధీరుడు రాజమౌళి పైన కోపం వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు ప్రశాంత్. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోల గురించి కామెంట్ చేశాడు. చాలా రోజుల వరకు రామ్ చరణ్, అల్లు అర్జున్ కోసం వెయిట్ చేసి తప్పు చేశాను అంటూ ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడట. ఇక ఈ వార్త కూడా నెట్ లో వైరల్ గా మారిపోయింది.మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా చెప్పండి ప్రశాంత్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ విషయం పైన ప్రశాంత్ వర్మ స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ లపై నేను కామెంట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. అసలు నా ఇంటర్వ్యూలో వీరిద్దరి పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు అంటే నాకు చాలా ఇష్టం. కథ దొరికితే తప్పకుండా ఎప్పటికైనా వీరిద్దరితో నేను సినిమా చేస్తాను.దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి ” అంటూ ప్రశాంత్ వర్మ కోరాడు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…
Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని…
This website uses cookies.