Ponnam Prabhakar : బోనాల ఉత్సవం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుదామని పర్యాటక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతరను దృష్టిలో పెట్టుకుని మంగళవారం గోల్కొండ కోటలో నిర్వహించిన అధికారుల సమన్వయ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించిన మంత్రి, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రత్యేకంగా పర్యాటక శాఖ బోనాల ప్రాధాన్యతను ప్రదర్శించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా రూపొందించాలన్నారు.
ఇప్పటి తరానికి రీల్స్, షార్ట్ వీడియోలపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో, సమాచార శాఖ ఈ మార్గాన్ని వినియోగించుకుని బోనాల గొప్పదనాన్ని ప్రజల్లోకి చొప్పించాలన్నారు. రీల్స్, మినీ డాక్యుమెంటరీల రూపంలో ప్రచారం జరపాలని సూచించారు. అలాగే, గతంలో లాగే ఆషాఢ మాసాంతం వరకు గోల్కొండ కోటలో ఉచిత ప్రవేశాన్ని కొనసాగించాలని, మంగళవారాల్లో ప్రత్యేకంగా ఉచిత ప్రవేశం కల్పించాలని పురావస్తు శాఖకు సిఫార్సు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ, గోల్కొండ బోనాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నామని తెలిపారు.సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, గోల్కొండ జగదాంబిక ఆలయ చైర్మన్ కొండెపుడి చంటిబాబు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ తదితరులు పాల్గొన్నారు.సమావేశానికి ముందు, మంత్రి పొన్నం ప్రభాకర్ గోల్కొండ కోటలోని నాగదేవత పుట్ట వద్ద పూజలు నిర్వహించి అమ్మవారికి కల్లు సాకపెట్టారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.