Pitru Paksha: హిందూమతంలో పూర్వీకులను స్మరించుకోవడం ఒక ఆనవాయితీగా ఉంటుంది అయితే పూర్వీకులను స్మరించుకోవడానికి పితృపక్షం సరైన సమయం అని భావిస్తారు. ఈ సమయంలో పెద్దవారిని స్మరించుకొని వారికి పిండ ప్రధానం చేయటం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని అలాగే మన పూర్వీకులు సంతోషం వ్యక్తం చేస్తారని భావిస్తారు. ఇక ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన ముగుస్తుంది.
ఈ సమయంలో ఎంతోమంది పెద్దవారు ఆత్మ శాంతి కలగాలని ప్రత్యేకంగా పిండ ప్రధానం చేస్తూ ఉంటారు. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో మనం తెలిసి తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటాము అయితే పొరపాటున కూడా ఈ తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు. పితృపక్షంలో పొరపాటున కూడా మద్యం మాంసం ముట్టుకోకూడదు. ఇలా పితృపక్షంలో వీటిని తీసుకోవటం వల్ల పూర్వీకులు ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.
పితృ పక్షం సమయంలో ప్రజలు ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఎరుపు రంగు కోపానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది. ఇక ఈ పితృపక్షంలో అబద్దాలు చెప్పకూడదు. పూర్వీకుల ప్రసన్నం చేసుకోవడం కోసం నిజాలే మాట్లాడాలి.పితృ పక్షంలో కోపం, హింసకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండి అందరితో ప్రేమగా మెలగాలి. పితృపక్షంలో అనైతిక చర్యలకు కూడా దూరంగా ఉండాలి. ఇలా ఈ పనులను పితృపక్షంలో అసలు చేయకూడదని ఇలాంటివి చేయడం వల్ల పితృదేవతల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.