Pitru Paksha: హిందూమతంలో పూర్వీకులను స్మరించుకోవడం ఒక ఆనవాయితీగా ఉంటుంది అయితే పూర్వీకులను స్మరించుకోవడానికి పితృపక్షం సరైన సమయం అని భావిస్తారు. ఈ సమయంలో పెద్దవారిని స్మరించుకొని వారికి పిండ ప్రధానం చేయటం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని అలాగే మన పూర్వీకులు సంతోషం వ్యక్తం చేస్తారని భావిస్తారు. ఇక ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన ముగుస్తుంది.
ఈ సమయంలో ఎంతోమంది పెద్దవారు ఆత్మ శాంతి కలగాలని ప్రత్యేకంగా పిండ ప్రధానం చేస్తూ ఉంటారు. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో మనం తెలిసి తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటాము అయితే పొరపాటున కూడా ఈ తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు. పితృపక్షంలో పొరపాటున కూడా మద్యం మాంసం ముట్టుకోకూడదు. ఇలా పితృపక్షంలో వీటిని తీసుకోవటం వల్ల పూర్వీకులు ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.
పితృ పక్షం సమయంలో ప్రజలు ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఎరుపు రంగు కోపానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది. ఇక ఈ పితృపక్షంలో అబద్దాలు చెప్పకూడదు. పూర్వీకుల ప్రసన్నం చేసుకోవడం కోసం నిజాలే మాట్లాడాలి.పితృ పక్షంలో కోపం, హింసకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండి అందరితో ప్రేమగా మెలగాలి. పితృపక్షంలో అనైతిక చర్యలకు కూడా దూరంగా ఉండాలి. ఇలా ఈ పనులను పితృపక్షంలో అసలు చేయకూడదని ఇలాంటివి చేయడం వల్ల పితృదేవతల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ…
saliva on Sleeping: సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో నోటి నుంచి మనకు తెలియకుండానే లాలాజలం వస్తుంటుంది. ఇలా లాలాజలం కారణంగా…
Tirumala SSD Tokens: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తిరుమల చేరుకుంటున్నారు.…
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
This website uses cookies.