Categories: LatestNewsPolitics

Pawan Kalyan: రైతుల కోసం వస్తోన్న జనసేనాని

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మరల రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న జనసేనాని వాటికి కొంత గ్యాప్ ఇచ్చి రైతులకి భరోసా ఇవ్వడం కోసం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా పోలవరం నిర్వాసితులని కూడా కలుసుకోనున్నారు. గత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా రబీ సాగులో ఉన్న చాలా పంట దెబ్బతింది. ఆరబెట్టిన ధాన్యం ఆకస్మికంగా పడిన వర్షాలకి తడిసిపోయాయి. రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న ప్రత్యక్షంగా మాత్రం జరగడం లేదనేది విపక్షాల ఆరోపణలు.

ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మరల కొద్దిగా యాక్టివ్ అయ్యి వర్షాలకి పంటలు నష్టపోయిన రైతులని పరామర్శించడానికి వస్తున్నారు. రైతులకి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు నెలల తర్వాత జనసేనాని ప్రజల్లోకి వస్తుండటంతో ఏం మాట్లాడుతారు అనే విషయంపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. అలాగే పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి పర్యటన వెనుక రైతులని పరామర్శించడం అనేది జెండా అయినా కూడా అసలైన అజెండా వేరే ఉందనే మాట వినిపిస్తోంది.

కాపు సామాజిక వర్గం ఓటర్లని ప్రభావితం చేయాలంటే గోదావరి జిల్లాలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ క్యాడర్ ని సమాయత్తం చేసే ఉద్దేశ్యంతోనే ఈ పర్యటన కొనసాగాబోతుంది అనే మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండానే విమర్శలు చేసే వైసీపీ నాయకులకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాక మరింతగా విమర్శలు చేసే అవకాశం కల్పించిందని చెప్పాలి.

Varalakshmi

Recent Posts

Chandrababu Naidu: ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఆఫీస్‌కు వెళ్లక్కర్లేదు.. ఏపీలో కొత్త రూల్స్‌..!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు త్వరలోనే ఒక భారీ మార్పు రాబోతోంది. ఇన్నాళ్లూ ఉద్యోగులు…

20 hours ago

TDP PARTY: చంద్రబాబు రూలే వేరు.. లోకేష్‌ను కూడా వ‌ద‌ల‌ట్లేదు పాపం..!

TDP PARTY: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒక డిసిప్లిన్. ఆయన పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి…

20 hours ago

Bandi Bhagirath: బండి సంజయ్ కుమారుడి కేసులో ట్విస్ట్‌.. ఊరంతా అవే పోస్టర్లు!

Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…

2 days ago

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ..!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…

2 days ago

Petrol Price News: ఇంత దారుణంగా పెట్రోల్ ధరలు పెరగనున్నాయా?

Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…

3 days ago

CM Revanth Reddy: కేంద్రంతో క‌లుస్తాం.. కానీ, అందుకు మాత్రం కాదు!

CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

3 days ago

This website uses cookies.