Categories: LatestNewsPolitics

Pawan Kalyan: రైతుల కోసం వస్తోన్న జనసేనాని

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మరల రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న జనసేనాని వాటికి కొంత గ్యాప్ ఇచ్చి రైతులకి భరోసా ఇవ్వడం కోసం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా పోలవరం నిర్వాసితులని కూడా కలుసుకోనున్నారు. గత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా రబీ సాగులో ఉన్న చాలా పంట దెబ్బతింది. ఆరబెట్టిన ధాన్యం ఆకస్మికంగా పడిన వర్షాలకి తడిసిపోయాయి. రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న ప్రత్యక్షంగా మాత్రం జరగడం లేదనేది విపక్షాల ఆరోపణలు.

ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మరల కొద్దిగా యాక్టివ్ అయ్యి వర్షాలకి పంటలు నష్టపోయిన రైతులని పరామర్శించడానికి వస్తున్నారు. రైతులకి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు నెలల తర్వాత జనసేనాని ప్రజల్లోకి వస్తుండటంతో ఏం మాట్లాడుతారు అనే విషయంపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. అలాగే పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి పర్యటన వెనుక రైతులని పరామర్శించడం అనేది జెండా అయినా కూడా అసలైన అజెండా వేరే ఉందనే మాట వినిపిస్తోంది.

కాపు సామాజిక వర్గం ఓటర్లని ప్రభావితం చేయాలంటే గోదావరి జిల్లాలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ క్యాడర్ ని సమాయత్తం చేసే ఉద్దేశ్యంతోనే ఈ పర్యటన కొనసాగాబోతుంది అనే మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండానే విమర్శలు చేసే వైసీపీ నాయకులకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాక మరింతగా విమర్శలు చేసే అవకాశం కల్పించిందని చెప్పాలి.

Varalakshmi

Recent Posts

Tirumala: శ్రీవారి భక్తులు అలర్ట్…SSD టోకెన్ రద్దు చేసిన టీటీడీ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…

3 hours ago

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

1 day ago

Temple Donation: ఆలయానికి డబ్బు దానం ఇస్తున్నారా? ఇవి దానం చేస్తే రెట్టింపు పుణ్యం?

Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…

1 day ago

Health care: రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేస్తున్నారా.. ఈ ఇబ్బందులు మీ వెంటే?

Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…

2 days ago

Tirumala: తిరుమల భక్తులు అలర్ట్.. గదుల  కేటాయింపులో కీలక మార్పులు చేసిన టీటీడీ..

Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…

2 days ago

Covid 19: కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…

3 days ago

This website uses cookies.