pawan-kalyan-balakrishna-combination-movie
Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఇక ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్ ఫస్ట్ 1 ఇప్పటికే టెలికాస్ట్ అయ్యింది. తాజాగా గురువారం పార్ట్ 2 ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఎప్పటిలాగే ఈ ఎపిసోడ్ కి విపరీతమైన ఆదరణ లభించింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన విషయాలని పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. ముఖ్యంగా రాజకీయ అంశాల గురించి ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ లో దర్శకుడు కిష్ కూడా పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ పార్ట్ 2లో మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. బాలకృష్ణ ఈ ఎపిసోడ్ వేదికగా పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణ అభిప్రాయానికి ఒకే చెప్పారు. కలిసి పనిచేయడానికి తాను సిద్ధమే అని చెప్పారు. ఇక ఈ సినిమాని క్రిష్ దర్శకత్వం వహించాలని కూడా బాలకృష్ణ సజిస్ట్ చేయడం విశేషం. దీంతో అన్ స్టాపబుల్ వేదికగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సినిమా సెట్ అయ్యిందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇక క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం కూడా కన్ఫర్మ్ అయిపొయింది.
అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాని నిర్మించేందుకు ఎవరు ముందుకి వస్తారు అనేది వేచి చూడాలి. ఇప్పటికే మెగా నందమూరి హీరోలు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాని చేశారు. ఈ సినిమాతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కలిపేసారు. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య కొంత వైరుధ్యం ఉన్న కూడా అయినా కూడా మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ ని కలపడానికి ఇప్పుడు పవర్ స్టార్, బాలకృష్ణ కలిసి సినిమాని చేయడానికి రెడీ అవడం విశేషం.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.