Parijatham Plant: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటాము. అదేవిధంగా ఎన్నో రకాల వృక్షాలను కూడా దైవ సమానంగా భావించి పూజిస్తూ ఉంటాము. ఇలా దైవ సమానంగా భావించి పూజించే మొక్కలలో పారిజాతం ఒకటి. ఈ పారిజాత వృక్షాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తుంటారు.
పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి సాగర మధనం చేస్తున్నటువంటి సమయంలో ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఈ పారిజాతం వృక్షాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆ ఇంటిలో సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక పారిజాత పుష్పాలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఎక్కువగా పూస్తాయి .
ఈ పారిజాత పుష్పాలు రాత్రి సమయంలో విరబూసి ఉదయానికి చెట్టు నుంచి రాలిపోతాయి. ఇలా రాలిపోయిన పుష్పాలను ఏరి పూజించడం వల్ల శుభం కలుగుతుంది. ఇక పారిజాత వృక్షాన్ని మన ఇంటి ఆవరణంలో నాటుకునేటప్పుడు ఎక్కడపడితే అక్కడ కాకుండా తులసి కోట పక్కన నాటుకోవడం ఎంతో మంచిది. అలాగే ఇంటి దగ్గరలోనే ఆలయ ప్రాంగణం ఉంటే అక్కడ కూడా ఈ వృక్షాన్ని నాటడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం,…
Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…
Eyes: ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
This website uses cookies.