Vadibiyyam: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఇంటి ఆడపడుచుకు పెళ్లి చేసి పంపిన తర్వాత ప్రతి ఏడాది పుట్టింటికి తనని పిలిచి తన కోడి బియ్యం పోసి పంపిస్తూ ఉంటాము. ఇలా తమ ఇంటి ఆడబిడ్డ దీర్ఘ సుమంగళీగా ఉండాలని భావించి ప్రతి ఏడాది తనకు ఒడి బియ్యం పోయడం మన హిందూ సాంప్రదాయాలలో ఆచారంగా మారిపోయింది. మరి ఆడపిల్లలకు వడి బియ్యం పోయడం వెనుక ఉన్నటువంటి కారణమేంటి ఇలా ఎందుకు పోస్తారనే విషయానికి వస్తే..
మనిషి వెన్ను లోపల 72 వేల నాడులను ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.ఈనాడులు కలిసేచోట చక్రం వుంటుంది. విధంగా మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి.అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. చక్రం మధ్యభాగంలో “ఒడ్డియాన పీఠం” ఉంటుంది కనుక అమ్మాయిలు నడుము ధరించే ఆభరణాలను వడ్డానం అని కూడా పిలుస్తారు.పీఠంలో ఉన్న శక్తి పేరు మహాలక్ష్మి.అందుకే ఆడపిల్లలను ఆ ఇంటి మహాలక్ష్మిగా భావించి ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమ గాజులతో పాటు వారికి నచ్చిన దుస్తులను పెట్టి వడి బియ్యం పోస్తాము.
ఇలా ప్రతి ఏడాది ఆడపిల్లకు ఒడి బియ్యం పోవడం వల్ల తనని మహాలక్ష్మిగా భావించి తన పుట్టింటికి మంచి కలగాలని అలాగే ఈ ఒడి బియ్యం తీసుకొని అత్తారింటికి వెళ్తే అక్కడ కూడా మంచి జరగాలని భావించి ఇలాంటి సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు ఇప్పటికీ కూడా ఇంటి ఆడపడుచులకి ప్రతి ఏడాది ఒడి బియ్యం పోస్తారు. అలాగే మరికొందరు మూడు సంవత్సరాలకు ఒకసారి లేదంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇలా బియ్యం పెడుతూ ఉంటారు.
Telangana: అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఒకే ఒక్క చక్కటి పేరును సూచించడం ద్వారా అక్షరాలా ఒక లక్ష…
AP POLITICS: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు అంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఒకరినొకరు నామరూపాలు…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. కూటమి ప్రభుత్వంలో త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో…
Tollywood: టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్…
Chicken: సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని మన పెద్ద వాళ్ళు చెబుతుంటారు. జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినడం…
Tirumala Darshan Tickets: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నటువంటి భక్తులకు టిటిడి శుభవార్తను తెలిపింది.…
This website uses cookies.