Nithya Menon : అలా మొదలైంది మూవీలో టాలీవుడ్ కి పరిచయమైంది మలయాళి బ్యూటీ నిత్యామీనన్ . ఫస్ట్ మూవీతోనే తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఫిదా చేసేసింది. తన అందం, అభినయంతో పాటు ఎక్స్ట్రా సింగింగ్ టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పొట్టిగా ఉన్నా తన పుట్టెడు తెలివితేటలతో అందరినీ పడేసింది. కేవలం కళ్ళతోనే హావభావాలు పలికించి మంచి పాపులారిటీ సంపాదించింది. టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి స్టార్డమ్ ఉన్న నటి నిత్యా. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నితిన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నాని, సూర్య వంటి స్టార్ హీరోల తో యాక్ట్ చేసి వారికే టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఈ మధ్యనే కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ తో తిరు అనే మూవీ చేసి హిట్ కొట్టింది. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ వెబ్ సిరీస్ లతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా నిత్యా ప్రభాస్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో అలా మొదలైంది సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియా నిత్యామీనన్ని ప్రభాస్ గురించి ప్రశ్నించింది. అప్పుడు నిత్యా అమాయకంగా ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని చెబితే దానిని సెన్సేషన్ చేశారు. ఈ బ్యూటీని ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ , తెలుగు ఆడియన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు. ఈ దెబ్బతో నిత్య ఎక్కడికి వెళ్ళిన మీడియా ప్రభాస్ గురించిన ప్రశ్నలనే అడగటం మొదలు పెట్టారు. తెలుగు సినిమా చేస్తున్నావ్ ప్రభాస్ ఎవరో తెలియదా అంటూ అడిగేవారట. అంతే కాదు ఆమెకు పొగరెక్కువ అందుకే అలా సమాధానం ఇస్తోందని కూడా విమర్శించేవారట.
ఈ సంఘటనతో తనకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదని తాజాగా నిత్య మీనన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.” అలా మొదలైంది సినిమా చేస్తున్నప్పుడు నేను చాలా చిన్న అమ్మాయిని. నాకు తెలుగు సినిమాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలు ఒక్కటి కూడా చూడలేదు. టాలీవుడ్ లో ఎవరెవరు ఉన్నారో కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. ఆ టైంలో ప్రభాస్ గురించి అడగగానే నాకు తెలియదు కాబట్టి తెలియదు అని చెప్పాను. దానికి ఏదో పాపం చేసినట్లు నన్ను మానసికంగా వేధించారు. అది నా లైఫ్ లో చాలా గట్టిగా తగిలిన ఎదురుదెబ్బ. ఆ ఒక్క సంఘటనతో నేను చాలా నేర్చుకున్నా. ప్రతి చోటా నిజాయతీగా ఉండకూడదని డిసైడ్ అయ్యాను”అని నిత్యా మీనన్ తెలిపింది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.