Sapthami Gowda : కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ రోజుకో వివాదంతో హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. ఈ మధ్యనే స్టార్ హీరో దర్శన్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. ఇక లేటెస్టుగా ఇప్పుడు ఇండస్ట్రీలో మరో వివాదం తెరమీదకు వచ్చింది. యంగ్ హీరో యువ రాజ్కుమార్ భార్య శ్రీదేవి బైరప్పపై ‘కాంతార’ ఫేమ్ నటి సప్తమి గౌడ రూ.10 కోట్ల పరువు నష్టం కేసు ఫైల్ చేసింది. ఈ కేసుతో మరోసారి కన్నడ ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మరింది.
‘యువ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు యువ రాజ్ కుమార్ . యువ రాజ్ కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్ సోదరుడి కుమారుడు. ఈ మూవీలో యువ రాజ్ కు జోడీగా సప్తమి యాక్ట్ చేసింది. ఈ మూవీ మంచి రెస్పాన్స్ వచ్చింది. వసూళ్ల పరంగా కూడా ఫర్వాలేదనిపించింది. అయితే వ్యక్తిగతంగా మాత్రం ఈ సినిమాతో యువ రాజ్ కి గట్టి దెబ్బే తగిలింది. రీసెంట్ గా యువ రాజ్కుమార్ తన భార్య శ్రీదేవి నుంచి డివోర్స్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ డివోర్స్ న్యూస్ కన్నడ నాట సెన్సేషన్ అయ్యింది. అయితే డివోర్స్ నోటీసులు అందిన నాటి నుంచి శ్రీదేవి మీడియాలో సంచలన ఆరోపణలు చేస్తోంది. తమ విడాకులకు నటి సప్తమి గౌడ కారణమంటూ ఆమె ఆరోపిస్తోంది. తన భర్తకు సప్తమితో వివాహేతర సంబంధం ఉందని శ్రీదేవి తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సప్తమి గౌడ,తన భర్త ప్రేమలో ఉన్నారని తాను అమెరికా వెళ్లినప్పుడు వీరిద్దరూ లివింగ్ లో ఉన్నారని కూడా చెప్పుకొచ్చింది. సప్తమి కోసం తనను ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం కూడా నా భర్త చేశాడని చెప్పింది శ్రీదేవి.
అయితే తాజాగా ఈ ఆరోపణలపై నటి సప్తమి సీరియస్ అయింది. ఏమాత్రం ఆలోచించకుండా శ్రీదేవి భైరప్పపై బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసింది. తన పరువుకి నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా ఆమెపై యాక్షన్ తీసుకోవాలని కోరింది. దీంతో శ్రీదేవికి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. దానితో పాటే సప్తమి పరువునష్టం దావా కూడా వేసింది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరైనది కాదని, ఇలాంటి ఆరోపణల వల్ల తన పరువకి నష్టం వాటిల్లిందని రూ.10 కోట్లు చెల్లించాలని సప్తమి డిమాండ్ చేసింది. అంతే కాదు మీడియా ఎదురుకుగా వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలిపింది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.