e-rupi: ప్రస్తుతం డిజిటల్ కరెన్సీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా చలామణిలో ఉంది. పేమెంట్స్ అన్ని కూడా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే ఎక్కువగా అవుతున్నాయి. కరోనా కాలంలో రెండేళ్లలో ఈ డిజిటల్ పేమెంట్ వ్యవస్ధ తారాస్థాయికి చేరింది. చిన్న టీ స్టాల్ నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు డిజిటల్ పేమెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాయి. మరో ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఈ డిజిటల్ పేమెంట్ విధానం వంద శాతం అమల్లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేతిలో డబ్బులు పెట్టుకొని తిరిగేకంటే బ్యాంకులో ఉంటే స్మార్ట్ ఫోన్ సహాయంతో ఎప్పుడైనా, ఎలా అయినా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు అనే ఆలోచనలకి మెజారిటీ ప్రజలు వచ్చేసారు.
కేవలం గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే ప్రజలకి ఈ డిజిటల్ పేమెంట్ గురించి అంత అవగాహన లేదు. అలాగే క్రిప్టో కరెన్సీ అనేది ప్రపంచ వ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీ. దీనికి ప్రత్యక్ష రూపం లేకపోయినా ఈ-కరెన్సీగా మార్కెట్ లో చలామణిలో ఉంది. ఇప్పుడు మార్కెట్ లో బ్లాక్ మనీ కూడా క్రిప్టో కరెన్సీ రూపంలోనే విదేశాలకి తరలి వెళ్తుందని మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఓ విధంగా రూపం లేని ఈ క్రిప్టో కరెన్సీ ప్రపంచ మార్కెట్ ని శాసిస్తుంది. అనేక కంపెనీలు వీటిలో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి. అయితే ఎప్పుడు ఒకప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ పూర్తిగా కూలిపోవడం గ్యారెంటీ అనే మాటని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ-రూపీని ఆర్బీఐ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా వినియోగదారులకి పంపిణీ చేస్తాయి. ఫిజికల్ కరెన్సీ రూపంలోనే ఈ డిజిటల్ కరెన్సీ కూడా పని చేస్తుంది. కరెన్సీ వినియోగాన్ని మరింత సులభతరం చేయడానికి ఆర్బీఐ ఈ కొత్త ఈ-రూపీని తీసుకొస్తుంది. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అయ్యి భవిష్యత్తులో ఇండియాలో వినియోగంలో ఉంటుందనేది చూడాలి.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.