Categories: LatestNews

Smart phone: ఎక్కడ పడితే అక్కడ మొబైల్ ఛార్జింగ్ పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త

Smart phone: స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత వీటి వాడకం బాగా పెరిగింది. దీంతో ఫోన్స్ లో గంటల తరబడి ఛార్జింగ్ ఉండే పరిస్థితి ఉండదు. దీంతో ఫోన్ ఛార్జింగ్ కోసం బ్యాక్ అప్ పవర్ బ్యాంకులు వినియోగిస్తున్నారు. అలాగే పవర్ బ్యాంకు లేని సమయంలో అత్యవసర వినియోగం కోసం రోడ్ సైడ్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని అక్కడికి వెళ్లి పెట్టుకుంటున్నారు. ఇలాంటి మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ని ప్రధాన నగరాలలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

తెలుగు రాష్ట్రాలలో వీటి ఉనికి తక్కువగానే ఉన్న నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మధ్య కాలంలో మొబైల్ పబ్లిక్ పవర్ పాయింట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే అలాంటి పబ్లిక్ పవర్ స్టేషన్ లందు ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు చాలా రకాలుగా జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైన తర్వాత సైబర్ మోసాలు మరింత ఈజీ అయిపోయాయి.

కొత్త కొత్త మార్గాలలో ఈ టెక్ కేటుగాళ్లు మన ఫోన్ డేటాని దొంగిలించి బ్యాంకు అకౌంట్స్ లో డబ్బులు మాయం చేయడం, అలాగే మన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకొని బెదిరింపులకి పాల్పడటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ పవర్ స్టేషన్స్ ని కూడా సైబర్ దొంగలు తమకి అనుకూలంగా మార్చుకున్నట్లు సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఛార్జింగ్ స్టేషన్స్ లో ఫోన్స్ కి యూఎస్బీ కేబుల్ సహాయంతో ఛార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తాము. అయితే ఆ సమయంలో వారు తెలియకుండానే మన ఫోన్స్ లోకి ఒక హ్యాకింగ్ వైరస్ ని ఇంజక్ట్ చేస్తారు. తరువాత మన ఫోన్ డేటా మొత్తం వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ వైరస్ ఉందనే విషయం గుర్తించకుండా ఫోన్ ద్వారా లావాదేవీలు చేసినపుడు సమాచారం దొంగిలించి అకౌంట్స్ లో డబ్బులు ఖాళీ చేస్తారు.

ఇలా ఫోన్స్ హ్యాక్ చేసి సమాచారం దొంగిలించడాన్ని జ్యూస్ జాకింగ్ అని సాంకేతిక భాషలో అంటున్నారు. ముఖ్యంగా పబ్లిక్ స్టేషన్లలో ఫోన్ చార్జింగ్ చేసే సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు లేకుండా ఉంటే కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యూఎస్బీ కేబుల్స్ ని హ్యాకర్లు వారికి అనుకూలమైన వేరే డివైజ్ కి సెటప్ చేస్తారు. వాటి పిన్ ని చార్జింగ్ కోసం అని ఫోన్ కి అటాచ్ చేయగానే మన ఫోన్ హ్యాక్ అవుతుంది. ఆ సమయంలో ఒక మలవేర్ ని ఫోన్ లోకి వారు పంపించే ప్రయత్నం చేస్తారు.

ఫోన్ లో చార్జింగ్ అవుతున్నప్పుడు ఒక ప్రాంప్ట్ వస్తుంది. హ్యాకర్లు అయితే దానిని ఓకే చేయమని చెబుతారు. ప్రాంప్ట్ ఓకే చేస్తే చార్జింగ్ అవుతుందని కూడా అంటారు. అయితే ఎట్టి పరిస్థితిలో కూడా ప్రాంప్ట్ కి క్లిక్ చేయకూడదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే మన ఫోన్ కి సంబంధించిన సమస్త సమాచారం వారి చేతికి అందించినట్లు అవుతుంది. అయితే దూర ప్రాంతాలకి వెళ్ళినపుడు మొబైల్ చార్జర్స్ ని మనతో పాటు తీసుకొని వెళ్లి కేవలం ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు ఉన్న ప్రాంతాలలో చార్జింగ్ పెట్టుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. పబ్లిక్ మొబైల్ చార్జింగ్ స్టేషన్స్ కి వెళ్లకపోవడం ఉత్తమం అని చెబుతున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…

11 hours ago

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…

11 hours ago

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

4 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

4 days ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

4 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

4 days ago

This website uses cookies.