Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 5 దశాబ్దాలుగా మాస్ క్లాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రతీ ఒక్క సినీ ప్రేమికుడిని అలరిస్తున్న బాలయ్య, ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ కథా చిత్రాలతో మెప్పించాడు. ఫ్యాక్షన్ సినిమా అంటే కేరాఫ్ బాలకృష్ణ. యాక్షన్ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగులుతో విరుచుకుపడేది బాలయ్యే. ఇక, పౌరాణిక..జానపద చిత్రాలలో బాలకృష్ణ చేసిన పాత్రలు మైలురాయిలా మిగిలాయి.

ఇటీవల కాలంలో బాలకృష్ణ చేసిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్నాయి. గత చిత్రం అఖండ 2 సనాతన హైంధవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి, ఆచరించాలి అనే రీతిలో రూపొందించగా, ఇందులో ఆయన పోషించిన రెండు పాత్రలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రస్తుతం, బాలకృష్ణ తన 111 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు..మరో వైపు రజకీయాలతో ప్రేక్షకులకి, ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు.

nandamuri-balakrishna-to-receive-lifetime-achievement-award

Balakrishna: యాభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు

అంతేకాదు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలందిస్తున్న సంగతీ మనందరికీ తెలిసిందే. అయితే, బాలయ్యకు తాజాగా మన నట సింహానికి ఢిల్లీలోని భారత్ మండపంలో ఎంతో ఘనంగా జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ’ 2026 వేడుకల్లో ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ను అందజేశారు. బాలకృష్ణ తన యాభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, అలాగే.. అంకితభావంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డును స్వీకరించడం మరో విశేషం.

కాగా, ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమలకి చెందిన పలువురు సినీ ప్రముఖులు, ఇతర రాజకీయ మరియు సాంస్కృతిక రంగాల ప్రముఖులు పాల్గొని బాలయ్యను అభినందించారు. ఇక, ఇప్పటికే ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా స్థానం సంపాదించుకోగా, 2025లో భారత ప్రభుత్వం బాలకృష్ణను ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించిన సంగతి అందరికీ తెలిసిందే. ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ’ అందుకున్న ఈ అవార్డుతో బాలయ్య అభిమానులే కాక సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, వీరసింహారెడ్డి మూవీతో బాలకృష్ణకి సూపర్ హిట్ ఇచ్చిన మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇప్పుడు ఎన్‌బికె 111 చిత్రాన్ని చేస్తున్నాడు బాలయ్య. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Ananya Nagalla: “లీసా” నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది..

Ananya Nagalla: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం "లీసా". వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…

2 days ago

Prabhas-Spirit: సందీప్ రెడ్డి వంగ రేంజ్‌ ఇది..

Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…

3 days ago

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

1 week ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

2 weeks ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

2 weeks ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

2 weeks ago

This website uses cookies.