Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 5 దశాబ్దాలుగా మాస్ క్లాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రతీ ఒక్క సినీ ప్రేమికుడిని అలరిస్తున్న బాలయ్య, ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ కథా చిత్రాలతో మెప్పించాడు. ఫ్యాక్షన్ సినిమా అంటే కేరాఫ్ బాలకృష్ణ. యాక్షన్ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగులుతో విరుచుకుపడేది బాలయ్యే. ఇక, పౌరాణిక..జానపద చిత్రాలలో బాలకృష్ణ చేసిన పాత్రలు మైలురాయిలా మిగిలాయి.
ఇటీవల కాలంలో బాలకృష్ణ చేసిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్లను అందుకున్నాయి. గత చిత్రం అఖండ 2 సనాతన హైంధవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి, ఆచరించాలి అనే రీతిలో రూపొందించగా, ఇందులో ఆయన పోషించిన రెండు పాత్రలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రస్తుతం, బాలకృష్ణ తన 111 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు..మరో వైపు రజకీయాలతో ప్రేక్షకులకి, ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు.
అంతేకాదు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలందిస్తున్న సంగతీ మనందరికీ తెలిసిందే. అయితే, బాలయ్యకు తాజాగా మన నట సింహానికి ఢిల్లీలోని భారత్ మండపంలో ఎంతో ఘనంగా జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ’ 2026 వేడుకల్లో ప్రతిష్టాత్మక ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ ను అందజేశారు. బాలకృష్ణ తన యాభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, అలాగే.. అంకితభావంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డును స్వీకరించడం మరో విశేషం.
కాగా, ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమలకి చెందిన పలువురు సినీ ప్రముఖులు, ఇతర రాజకీయ మరియు సాంస్కృతిక రంగాల ప్రముఖులు పాల్గొని బాలయ్యను అభినందించారు. ఇక, ఇప్పటికే ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా స్థానం సంపాదించుకోగా, 2025లో భారత ప్రభుత్వం బాలకృష్ణను ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించిన సంగతి అందరికీ తెలిసిందే. ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ’ అందుకున్న ఈ అవార్డుతో బాలయ్య అభిమానులే కాక సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, వీరసింహారెడ్డి మూవీతో బాలకృష్ణకి సూపర్ హిట్ ఇచ్చిన మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇప్పుడు ఎన్బికె 111 చిత్రాన్ని చేస్తున్నాడు బాలయ్య. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ పదం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. నిన్నమొన్నటి దాకా అభివృద్ధి, సంక్షేమం,…
Politics: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.…
Eyes: ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
This website uses cookies.