Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 5 దశాబ్దాలుగా మాస్ క్లాస్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రతీ ఒక్క సినీ ప్రేమికుడిని అలరిస్తున్న బాలయ్య, ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ కథా చిత్రాలతో మెప్పించాడు. ఫ్యాక్షన్ సినిమా అంటే కేరాఫ్ బాలకృష్ణ. యాక్షన్ సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగులుతో విరుచుకుపడేది బాలయ్యే. ఇక, పౌరాణిక..జానపద చిత్రాలలో బాలకృష్ణ చేసిన పాత్రలు మైలురాయిలా మిగిలాయి.
ఇటీవల కాలంలో బాలకృష్ణ చేసిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్లను అందుకున్నాయి. గత చిత్రం అఖండ 2 సనాతన హైంధవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి, ఆచరించాలి అనే రీతిలో రూపొందించగా, ఇందులో ఆయన పోషించిన రెండు పాత్రలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రస్తుతం, బాలకృష్ణ తన 111 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు..మరో వైపు రజకీయాలతో ప్రేక్షకులకి, ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు.
అంతేకాదు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలందిస్తున్న సంగతీ మనందరికీ తెలిసిందే. అయితే, బాలయ్యకు తాజాగా మన నట సింహానికి ఢిల్లీలోని భారత్ మండపంలో ఎంతో ఘనంగా జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ’ 2026 వేడుకల్లో ప్రతిష్టాత్మక ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ ను అందజేశారు. బాలకృష్ణ తన యాభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, అలాగే.. అంకితభావంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డును స్వీకరించడం మరో విశేషం.
కాగా, ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమలకి చెందిన పలువురు సినీ ప్రముఖులు, ఇతర రాజకీయ మరియు సాంస్కృతిక రంగాల ప్రముఖులు పాల్గొని బాలయ్యను అభినందించారు. ఇక, ఇప్పటికే ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా స్థానం సంపాదించుకోగా, 2025లో భారత ప్రభుత్వం బాలకృష్ణను ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించిన సంగతి అందరికీ తెలిసిందే. ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ’ అందుకున్న ఈ అవార్డుతో బాలయ్య అభిమానులే కాక సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, వీరసింహారెడ్డి మూవీతో బాలకృష్ణకి సూపర్ హిట్ ఇచ్చిన మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇప్పుడు ఎన్బికె 111 చిత్రాన్ని చేస్తున్నాడు బాలయ్య. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.