Namitha-Veerendra : సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఉంది. ఆల్మోస్ట్ టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలతో జోడి కట్టి ఇండస్ట్రీలో ఉన్నంతకాలం సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగించింది. ఆ తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. అయితే పెళ్లయినప్పటి నుంచి నమితకు కష్టాలు వచ్చాయనే చెప్పాలి. నమిత భర్త వీరేంద్ర చౌదరి ప్రస్తుతం పరారిలో ఉన్నాడు. అతనికోసం తమిళనాడు పోలీసులు గల్లీ గల్లీ గలీస్తున్నారు . ఓ ఫ్రాడ్ కేసులో నమిత భర్తకు పోలీసులు నోటీసులు పంపారు. అయితే ప్రస్తుతం అతని ఆచూకీ తెలియడం లేదు. అరెస్ట్ చేస్తారనే భయంతో వీరేంద్ర పారిపోయి ఉంటాడని అంతా భావిస్తున్నారు.
మీడియా కథనాలా ప్రకారం.. సేలం జిల్లాలో ఉంటున్న గోపాలస్వామి తనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన సూక్ష్మ, చిన్న- మధ్యతరహా పరిశ్రమల సంస్థలోని తమిళనాడు డివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇప్పించాలని రూ. 50 లక్షల లంచం ఇచ్చాడు. అదే విభాగానికి గతంలో విధులు నిర్వహించిన మాజీ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్లకు ఈ సొమ్ము అప్పగించాడు. అయితే ఈ పోస్టులో రీసెంట్ గా వీరేంద్ర చౌదరి అనే అతను అపాయింట్ అయ్యాడు. దీంతో బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగిందో తెలియజేయాలనీ గోపాలస్వామి సేలం పోలీసులను అశ్రయించాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈమధ్యనే వారిద్దరీని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం రాబట్టడానికి వీరంద్ర చౌదరికి కూడా నోటీసులు పంపారు.
అయితే వీరంద్ర చౌదరి విచారణకు రాలేదు. దీంతో పోలీసులు మళ్లీ నోటీసులు పంపారు. అయినా స్పందన లేకపోవడంతో అసలు విషయం ఏంటో తెలుసుకున్నారు. వీరేంద్ర ఇంట్లో లేకపోవడంతో అరెస్టు భయంతో పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. టాలీవుడ్తో పాటు కోలీవుడ్లోనూ ఓ వెలుగు వెలిగిన తార నమిత. నమిత మీద ఉన్న అభిమానంతో ఆమె అభిమానులు తమిళనాడులో ఆమె పేరిట గుడి కూడా కట్టారు. సినిమాలకు బై బై చెప్పేసిన నమిత 2017లో వీరేంద్రను పెళ్లి చేసుకుంది. ఆమెకు కవల పిల్లలు ఉన్నారు.
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
Puranapanda Srinivas: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
This website uses cookies.