Inspiring: ఈ సమాజంలో మనం చేసే పని, ఆడే మాట, వెళ్ళే మార్గం, అర్ధం చేసుకునే విషయం ఏదైనా కూడా మంచి విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. మన విచక్షణ మీదనే ఆధారపడి మన జీవితంలో భవిష్యత్తు ఉంటుంది. ఆ విచక్షణా జ్ఞానం ఒక్కొక్కరికి ఒక్కోలా పని చేస్తుంది. చాలా మంది తాము ఆడే మాటలని సమర్ధించుకుంటూ ఉంటారు. నేను ఏది మనసులో దాచుకోలేను. ఏదైనా అనాలని అనిపిస్తే అనేస్తా అంటారు. మరికొందరు నేను ఎవరిని ఏమీ అనలేను. నా మంచితనం నన్ను మాట్లాడనివ్వదు అని అంటారు.
అయితే ఈ రెండు రకాల మనస్తత్వాలు కూడా సమాజంలో ప్రమాదకరమనే చెప్పాలి. ఎవరు ఏం అన్నా కూడా మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతే కొందరు మంచితనం అంటారేమో కాని చాలా మంది చేతకానితనం అంటారు. అలాగే ఎవరైనా ఏదైనా మాట అంటే వెంటనే వారికి లాగిపెట్టి కొట్టేలా ఎదురు సమాధానం చెప్పడం తెలివైన పద్ధతి అనుకుంటున్నారేమో… కాని చాలా మంది మూర్ఖత్వం, టెంపరితనం అనే అభిప్రాయాన్ని సమాజంలోకి తీసుకొని వెళ్తుంది. సమాజంలో ఉన్న తర్వాత ఏ స్థాయిలో ఉన్న కూడా పదిమందితో కలిసి ప్రయాణం చేయాల్సిందే. ఆ పదిమందిలో మనల్ని అభిమానించే వారు ఉంటారు. ద్వేషించే వారు ఉంటారు. మన ఎదుగుదలకి సహకరించే వారు ఉంటారు. అంత మంది మధ్యలో ఉన్న తర్వాత ఆడే మాట, చేసే పని, తీసుకునే నిర్ణయం అన్ని కూడా మన విచక్షణని, మన స్థాయిని ఈ సమాజంలో నిర్ణయిస్తాయి.
మన స్థితిని ఈ సమాజానికి పరిచయం చేస్తుంది. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంటే మన ఆలోచన విధానం ఎప్పుడు కూడా రెస్పాండ్ అయ్యే అంశంపై లోతుగా అధ్యయనం చేసి తరువాత సరైన పద్దతిలో రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. నువ్వు నిజంగా సమాజంలో గొప్పగా ఎదగాలన్నా, పదిమంది మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గౌరవించాలన్నా ఆ రెస్పాండ్ అండ్ రియాక్షన్ అనేది చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ రెండు కరెక్ట్ గా ఉండాలంటే మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.